సీమ కోసం జల దీక్ష | jaladeeksha will starts for seema people, says chandra babu | Sakshi
Sakshi News home page

సీమ కోసం జల దీక్ష

May 3 2015 4:56 AM | Updated on Aug 14 2018 11:24 AM

సీమ కోసం జల దీక్ష - Sakshi

సీమ కోసం జల దీక్ష

రాయలసీమను సస్యశ్యామలంగా మార్చేందుకు తాను జలదీక్షకు దిగుతానని సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు.

  • ‘నీరు-చెట్టు’ ప్రారంభోత్సవంలో బాబు
  • సాక్షి ప్రతినిధి, కర్నూలు: రాయలసీమను సస్యశ్యామలంగా మార్చేందుకు తాను జలదీక్షకు దిగుతానని సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు. కొందరు శివదీక్ష, మరికొందరు కనకదుర్గ దీక్ష చేస్తారని, అయితే తాను జలదీక్షకు పూనుకుంటానని ఆయ న వివరించారు. రాయలసీమకు సాగునీరు అం దించేవరకు నిద్రపోనని, అవసరమైతే కాల్వల మీదే పడుకుంటానని చెప్పారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని కోటేకల్లు గ్రామంలో శనివారం ఆయన ‘నీరు-చెట్టు’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగసభలో సీఎం మాట్లాడుతూ.. రాష్ట్రంలో కరువును పారదోలేందుకు ‘నీరు-చెట్టు’ ఉపయోగపడుతుందన్నారు. పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు కోటేకల్లుకు వచ్చానన్నారు.

    కర్నూలు జిల్లాకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తానని నొక్కిచెప్పారు. అనంతరం నీరు-చెట్టు పాటల సీడీని ఆవిష్కరించారు.  మద్యం ద్వారా ప్రభుత్వానికి ఆదాయం అవసరం లేదని సీఎం చంద్రబాబు అన్నారు. ఈ క్రమంలో కొత్త మద్యం విధానాన్ని తీసుకొస్తున్నట్టు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా బెల్టు షాపులను ఎత్తివేసి మద్యం యజమానుల బెల్టు తీశామని ఆవేశంగా ప్రసంగించారు. అయితే.. ఈ సందర్భంగా ఆస్పరి మండలం బిలేకల్లుకు చెందిన వీరన్న అనే వ్యక్తి సభ మధ్యలో లేచి.. ‘మా ఊర్లో అడుగడుగునా బెల్టు షాపులున్నాయం’టూ వాపోయారు.  బెల్టు దుకాణాలను ప్రోత్సహించే ఉద్యోగులపై చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా బాబు హెచ్చరించారు.
     
    ఆత్మగౌరవం ఉన్న నటుడు బాలకృష్ణ
    లెజెండ్ విజయోత్సవ సభలో సీఎం
    ఎమ్మిగనూరు: అభిమానం, ఆత్మగౌరవం మెండుగా ఉన్న నటుడు బాలకృష్ణ అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. శనివారం రాత్రి ఎమ్మిగనూరు లో లెజెండ్ సినిమా 400 రోజుల విజయోత్సవ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement