పెట్టింది తిను.. డబ్బులిచ్చిపో.. | Hotel owner attacks customers | Sakshi
Sakshi News home page

పెట్టింది తిను.. డబ్బులిచ్చిపో..

Jun 5 2015 3:39 PM | Updated on Sep 3 2017 3:16 AM

పెట్టింది తిని, మారు మాట్లాడకుండా డబ్బులిచ్చి పోవాల్సిందే మరి ఆ హోటల్‌కి వెళ్తే!

అన్నవరం (తూర్పుగోదావరి జిల్లా) : పెట్టింది తిని, మారు మాట్లాడకుండా డబ్బులిచ్చి పోవాల్సిందే మరి ఆ హోటల్‌కి వెళ్తే!  ఆ హోటల్ తూర్పుగోదావరి జిల్లా అన్నవరంలోని సత్యనారాయణ స్వామి ఆలయానికి సమీపంలో ఉంది. శుక్రవారం ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన 20మంది భక్తులు అన్నవరం వెళ్లారు. ఈ క్రమంలోనే ఆలయానికి సమీపంలోని ఒక హోటల్‌లో భోజనం చేసేందుకు వెళ్లారు. అయితే భోజనం సరిగా లేకపోవడంతో భక్తులు సదరు హోటల్ యజమానిని నిలదీశారు. దీంతో హోటల్ యజమాని సిబ్బందితో కలిసి భక్తులపై దాడి చేశాడు. ఈ దాడిలో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement