ఆదిలాబాద్ కల్చరల్, న్యూస్లైన్ : మున్సిపల్ ఎన్నికలపై హైకోర్టు ఇచ్చిన ఆదేశంతో జిల్లాలో సందడి మొదలైంది. నాలుగు వారాల్లో నిర్వహించాలంటే సాధ్యం కాదని అధికారులు పేర్కొంటున్నారు. జిల్లాలో ఏడు మున్సిపాలిటీలు ఉండగా, ఆరు మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి. మందమర్రి బల్దియా ప్రత్యేకపాలనలో ఉంటుందని అధికా ర వర్గాలు చెబుతున్నాయి.
ఎన్నికలు ఏ సమయంలో వచ్చినా 2013 సర్వే ప్రకారం నిర్వహిం చడానికి అధికారులు సిద్ధంగా ఉన్నారు. జిల్లా లో ఆదిలాబాద్, భైంసా, నిర్మల్, కాగజ్నగర్, మంచిర్యాల,బెల్లంపల్లి మున్సిపాలిటీలు ఉన్నా యి. మున్సిపాలిటీల్లో ఎన్నికలకు వార్డులవారీ గా రిజర్వేషన్లు ఖరారయ్యాయి. ఇప్పటి 2013 లో మున్సిపల్ అధికారులు పోలింగ్ బూత్లను గుర్తించారు. ఆదిలాబాద్లో 36 వార్డులకు 81, భైంసాలో 23 వార్డులకు 23, బెల్లంపల్లిలో 34 వార్డులకు 35, నిర్మల్లో 36 వార్డులకు 58, మంచిర్యాలకు 32 వార్డులకు 62 పోలింగ్ కేం ద్రాలు ఏర్పాటు చేశారు. వార్డులవారీగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల రిజర్వేషన్లు ఖరారు చే శారు. కలెక్టర్ ఆమోదం తీసుకుని సిద్ధంగా ఉన్నాయి.
నాలుగు వారాల్లో సాధ్యపడేనా?
నాలుగు వారాల్లో మున్సిపల్ ఎన్నికలను నిర్వహించాలనే హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నా అధికారుల్లో గుబులు నెలకొంది. 2014 ఎన్నికల ఓటర్ల జాబితా ఆధారంగా రిజర్వేషన్లు మారితే నాలుగు వారాల్లో ఎన్నికలు నిర్వహించడం కష్టమని అధికారులు భావిస్తున్నారు. ప్రత్యేక అధికారుల పాలనలో ఇన్నాళ్లు మున్సిపాలిటీలు కొనసాగాయి. గత 2010 సెప్టెంబర్ 31వ తేదీన మున్సిపల్ కౌన్సిల్ గడువు ముగిసింది.
దీంతో మూడున్నర ఏళ్లుగా ప్రత్యేక అధికారుల పాలనలో సాగింది. ప్రత్యేకంగా 2011లో జరగాల్సిన ఎన్నికలు జరగక పోగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం విషయంలో వచ్చిన ఆందోళనతో ఈ ఎన్నికలు నిర్వహణకు నోచుకోలేదు. ప్రస్తుతం హైకోర్టు నిర్ణయంతో ఆశావహులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు.
తెరపైకి మున్సి‘పోల్స్’
Published Wed, Feb 5 2014 4:56 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు ఎస్వీ డిగ్రీ కళాశాలకు ముగ్గురు కమిటీ సభ్యులరాక
No Headline
ఎన్నికల భారతం పుస్తకావిష్కరణ
వృత్తిదారుల మోములో ఆనందం...
ప్రతి సర్కిల్లో కంట్రోల్ రూం
హైదరాబాద్లో ఈదురుగాలులతో కూడిన భారీవర్షం (ఫొటోలు)
"పవన్ కళ్యాణ్ కు ఓటు వెయ్యం "..తేల్చి చెప్పిన పిఠాపురం టీడీపీ
రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి
ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలి
‘మోసం చేసిన వారిపై చర్య తీసుకోవాలి’
తప్పక చదవండి
- లగ్జరీ కారు కొనుగోలు చేసిన బుల్లితెర నటి..!
- అవినీతి ‘కాలువ’
- పాతబస్తీలో పతంగేనా?
- నేడు ఏపీలో ప్రధాని ఎన్నికల ప్రచారం
- పిడుగులుపడి ఏడుగురు మృత్యువాత
- బీజేపీ ఖైదీగా శ్రీరాముడు
- కాంగ్రెస్, బీఆర్ఎస్కు ఓటేస్తే ఎవరు ప్రధాని అవుతారో తెలియదు
- ప్రమాదంలో ముస్లిం సమాజం
- నేడు వేములవాడకు మోదీ!
- Telangana: మరో రెండు రోజులు వానలు
Advertisement