
తిరుమలలో పోటెత్తిన భక్తులు
వైకుంఠ ఏకాదశి సందర్భంగా కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి భక్తులు పోటెత్తారు.
తిరుమల : వైకుంఠ ఏకాదశి సందర్భంగా కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి భక్తులు పోటెత్తారు. శ్రీవారి దర్శనం కోసం గంటల కొద్దీ క్యూ లైన్లలో వేచి ఉన్నారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేసినా భక్తులు తీవ్ర అవస్థలకు గురవుతున్నారు.
సోమవారం రికార్డు స్థాయిలో భక్తులు విచ్చేయడంతో.. ఆలయ ప్రాంగణం కిటకిటలాడుతోంది. స్వామి వారిని ఈ రోజు సుమారు లక్ష మంది భక్తులు దర్శించుకుంటారని ఆలయ అధికారులు తెలిపారు.