పశ్చిమగోదావరి జిల్లా పోలవరం మండలంలోని కొత్తూరు కాజ్వేపై గోదావరి ఉధృతంగా పొంగి ప్రవహిస్తోంది.
పశ్చిమగోదావరి: పశ్చిమగోదావరి జిల్లా పోలవరం మండలంలోని కొత్తూరు కాజ్వేపై గోదావరి ఉధృతంగా పొంగి ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నవర్షాలతో ఆదివారం ఉదయం 11 గంటల నుంచి కాజ్వేపై నాలుగు అడుగుల ఎత్తులో వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో 17 గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మరో అడుగు మేర వరద ప్రవాహం పెరిగితే పడవలను తిప్పేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.