నిలిచిపోయిన జీమెయిల్‌; అనుమానాలు | Gmail Not Working In Andhra Pradesh Secretariat | Sakshi
Sakshi News home page

నిలిచిపోయిన జీమెయిల్‌; అనుమానాలు

May 6 2019 3:45 PM | Updated on May 6 2019 3:52 PM

Gmail Not Working In Andhra Pradesh Secretariat - Sakshi

ఆంధ్రప్రదేశ్‌ సచివాలయంలో జీమెయిల్ నిలిచిపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ తాత్కాలిక​ సచివాలయంలో సోమవారం జీమెయిల్ నిలిచిపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అన్ని ప్రభుత్వ శాఖల్లోనూ జీమెయిల్ పనిచేయకపోవడంతో సమాచార మార్పిడి నిలిచిపోయింది. ఫలితంగా ప్రభుత్వ సేవలకు తీవ్ర అంతరాయం కలిగింది. సెక్రటేరియట్ నెట్‌వర్క్ ఐపీలో బ్లాక్‌ చేయడం వల్లే జీమెయిల్‌ ఆగిపోయిందని ఉద్యోగ వర్గాలు వెల్లడించాయి.

జీమెయిల్ పనిచెయ్యకపోవడంపై ఉద్యోగుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ వ్యవహారాలన్నీ జీమెయిల్ ద్వారానే అధికారులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో హఠాత్తుగా జీమెయిల్‌ నిలిపివేయడంపై అనుమానాలు రేగుతున్నాయి. జీమెయిల్‌ను కావాలనే నిలిపివేశారా, మరేదైనా కారణం ఉందా అనే దానిపై వెంటనే స్పష్టత రాలేదు. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు స్పందించాల్సివుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement