వేర్వేరు ప్రాంతాల్లో ఈతకు వెళ్లి నలుగురు మృతి చెందిన ఘటన జిల్లాలో చోటు చేసుకుంది.
గుంటూరు: వేర్వేరు ప్రాంతాల్లో ఈతకు వెళ్లి నలుగురు మృతి చెందిన ఘటన జిల్లాలో చోటు చేసుకుంది. ఈత సరదా కాస్తా ఇద్దరు యువకులతో సహా, మరో ఇద్దరి చిన్నారుల పాలిట శాపంగా మారింది.అమరావతి మండలం వైకుంఠపురంలో స్నానానికి వెళ్లిన పీటీఎస్ ఇంజనీర్లు సందీప్, పాండురంగారావులు మృతి చెందగా, దాసరిపాలెంలో ఇద్దరు చిన్నారులు అసువులు బాసారు. దీంతో ఆ గ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇప్పటి వరకూ మృతదేహాల ఆచూకీ లభించకపోవడంతో అధికారులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.