అభిప్రాయసేకరణ సమావేశం రసాభాస! | Farmers protest in referendum meeting | Sakshi
Sakshi News home page

అభిప్రాయసేకరణ సమావేశం రసాభాస!

Nov 13 2014 5:55 PM | Updated on Jun 4 2019 5:04 PM

గుంటూరు జిల్లాలో రాజధాని ఏర్పాటు కోసం భూసేకరణకు సంబంధించి అభిప్రాయ సేకరణ కోసం నిర్వహించిన సమావేశం రసాభాసగా మారింది.

గుంటూరు: గుంటూరు జిల్లాలో రాజధాని ఏర్పాటు కోసం భూసేకరణకు సంబంధించి అభిప్రాయ సేకరణ కోసం నిర్వహించిన  సమావేశం రసాభాసగా మారింది. లింగాయపాలెం వెళ్లిన తాడికొండ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్, రాజమండ్రి లోక్సభ సభ్యుడు మాగంటి మురళీమోహన్లపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

అనుకూలంగా ఉన్న రైతులతో మాత్రమే మాట్లాడిస్తున్నారని, వ్యతిరేకించే రైతుల సమస్యలు ఎందుకు వినరని రైతులు ప్రశ్నించారు. ఏకపక్షంగా వ్యవహరించవద్దని వారు చెప్పారు. భూసమీకరణను వ్యతిరేకిస్తూ స్థానిక రైతులు ఘోరావ్ చేస్తున్నారు.  ముందు జాగ్రత్తగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.
**

Advertisement
 
Advertisement
Advertisement