సాక్షి, గుంటూరు
రవాణా సౌకర్యం సక్రమంగా లేని మారుమూల గ్రామాల్లో సైతం నిరుపేదలకు ప్రాథమిక వైద్య సేవలందించాలనే లక్ష్యంతో ఏర్పాటైన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు వెలవెలబోతున్నాయి. వేలకు వేలు జీతాలు తీసుకుంటున్న వైద్యాధికారులు ఆసుపత్రులకు సక్రమంగా రాకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కొందరు ప్రైవేటు వైద్యశాలలు పెట్టుకుని వారికి తీరినప్పుడు పీహెచ్సీలకు వస్తూ మమ అనిపిస్తున్నారు. మరికొందరు మరో అడుగు ముందుకేసి పీహెచ్సీలకు వస్తున్న రోగులకు తమ ప్రైవేట్ ఆసుపత్రుల అడ్రస్ ఇచ్చి అక్కడకు రమ్మంటూ తమ ప్రాక్టీస్ పెంచుకుంటున్నారు. కొన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలైతే మధ్యాహ్నానికి మూతపడుతున్నాయి. ఆదివారం వచ్చిందంటే అసలు తలుపులు కూడా తెరవని పరిస్థితి. ఆదివారం ఆరోగ్య కేంద్రాలకు సెలవు దినమనే భావన గ్రామీణ ప్రజల్లో ఉందంటే పీహెచ్సీల పనితీరు ఏవిధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. రోడ్డు ప్రమాదాలు జరిగినా, కుక్కకాటు, పాముకాటుకు గురైనా కనీసం ప్రాథమిక వైద్యం అందని దుస్థితి నెలకొంది. వైద్యులు అందుబాటులో లేక నర్సులు, దోబీలు, వాచ్మెన్లు డాక్టర్ అవతారమెత్తి క్షతగాత్రులకు చికిత్స, ఇంజక్షన్ చేస్తున్నారు. తీవ్రగాయాలైన వారిని ప్రాథమిక వైద్య సేవలకోసం ఆరోగ్య కేంద్రాలకు తీసుకువస్తే డాక్టర్లు అందుబాటులో లేక మరింత రక్తస్రావమే ప్రాణాలకే ముప్పు వాటిల్లుతున్న సందర్భాలు అనేకం ఉన్నాయి.
జీవో జారీ చేసి 15 రోజులైనా...
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేసే వైద్యులు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ ఆసుపత్రుల్లో అందుబాటులో ఉండాలని ప్రభుత్వం జీవో జారీ చేసి 15 రోజులు దాటినా జిల్లాలో ఎక్కడా ఇది అమలు కావడంలేదు. ఇది కాగితాలకే పరిమితమైంది. ఉదయం 9 గంటలకు రావాల్సిన వైద్యాధికారులు 11 గంటలు దాటితేగాని ఆసుపత్రి మొఖం చూడటంలేదు. వచ్చి రెండు గంటలు కూడా రోగులకు అందుబాటులో లేకుండా మధ్యాహ్నం ఒంటిగంట కల్లా భోజన విరామమంటూ వెళ్ళిపోతున్నారు. అలా వెళ్లినవారు ఇక ఆ రోజుకి మళ్ళీ కనిపించడంలేదని రోగులు వాపోతున్నారు. జ్వరాలు అధికంగా వచ్చే సీజన్ అయినప్పటికీ నర్సుల ద్వారానే తమ కార్యకలాపాలను నడిపిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలో 78 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉండగా, అందులో సుమారు 80 శాతం మంది వైద్యులు, సిబ్బంది స్థానికంగా నివాసం ఉండకుండా పట్టణ ప్రాంతాల నుంచి వచ్చి వెళ్తున్నారు. దీంతో వారు ఆసుపత్రికి ఏ సమయానికి చేరతారో, ఎప్పుడు వెళ్లిపోతారో తెలియని పరిస్థితి. వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు మాత్రం స్థానికంగా నివాసం ఉండని వారిపై, సమయపాలన పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ ఊదరగొట్టడం మినహా పట్టించుకున్న దాఖలాలు లేవని ప్రజలు మండిపడుతున్నారు. ఇప్పటికైనా ఇలాంటివారిపై కఠినంగా వ్యవహరించాలని పలువురు కోరుతున్నారు.
తీరు మారని వైద్యులు
Published Mon, Sep 29 2014 12:13 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
విద్య, వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు
డ్రైవర్ నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి
ప్రభుత్వ వైద్యశాలల్లో మెరుగైన వైద్యం
చంద్రబాబూ 14 ఏళ్లు ఏం చేశావు?
నీట్కు ఏర్పాట్లు పూర్తి
‘పోస్టల్ బ్యాలెట్’ను వినియోగించుకోండి
పార్లమెంట్లో గళం వినిపిస్తా..
స్వర్ణకవచాలంకరణలో రామయ్య
హామీలపై ఆశలు..
నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
తప్పక చదవండి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
Advertisement