తండ్రికి అంతిమ సంస్కారాలు చేసిన తనయ

Daughter Compleats Father Funeral Programme in Krishna - Sakshi

వారసులు ఉన్నా ముందుకు రాని వైనం

అన్నీ తానై పితృరుణం తీర్చుకున్న కుమార్తె

కృష్ణాజిల్లా, తోట్లవల్లూరు (పామర్రు) : కన్నతండ్రికి కుమార్తె అంతిమ సంస్కారాలు నిర్వహించిన ఘటన మండలంలోని బొడ్డపాడులో చోటు చేసుకుంది. తండ్రి తరఫున వారసులు ఉన్నా ఎవరూ ముందుకు రాకపోవటంతో కన్న కూతురే అన్నీ తానై జరిపించి పితృ రుణం తీర్చుకుంది. గ్రామానికి చెందిన గోరంట్ల శ్రీనివాసరావు (53) టైలరింగ్‌ చేస్తూ జీవనం సాగించేవాడు. ఆయనకు భార్య శివపార్వతి, కుమార్తెలు జ్యోత్స్న, శ్రీలక్ష్మి ఉన్నారు. శ్రీనివాసరావు కొంతకాలంగా అనారోగ్యానికి గురై ఈ నెల 25వ తేదీ రాత్రి మృతి చెందాడు. అతనికి తలకొరివి పెట్టేందుకు వారసులు ముందుకు రాలేదు. దీంతో పెద్ద కుమార్తె జ్యోత్స్న కొడుకు పాత్ర పోషించింది. తండ్రికి అంతిమ సంస్కారాలు నిర్వహించి గ్రామస్తులతో శభాష్‌ అనిపించుకుంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top