'మోసానికి మారు పేరు టీఆర్ఎస్' | Damodara Raja Narasimha takes on Kalvakuntla Chandrashekar Rao | Sakshi
Sakshi News home page

'మోసానికి మారు పేరు టీఆర్ఎస్'

Mar 16 2014 1:31 PM | Updated on Mar 18 2019 7:55 PM

'మోసానికి మారు పేరు టీఆర్ఎస్' - Sakshi

'మోసానికి మారు పేరు టీఆర్ఎస్'

కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చే ప్రసక్తి లేదంటూ టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ప్రకటించడంపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనర్సింహ స్పందించారు.

కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చే ప్రసక్తి లేదంటూ టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ప్రకటించడంపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనర్సింహ స్పందించారు.ఆదివారం హైదరాబాద్లో రాజనర్సింహ మాట్లాడుతూ... తెలంగాణ ఏర్పడిన అనంతరం టీఆర్ఎస్ను కాంగ్రెస్లో విలీనం చేస్తానని ఇప్పుడు కేసీఆర్ మాట తప్పారని రాజనర్సింహా ఆరోపించారు. టీఆర్ఎస్ పార్టీ దగా, మోసం, వంచనలకు మారు పేరని ఆయన అభివర్ణించారు.

కాంగ్రెస్ అధిష్టానానికి ఇచ్చిన మాటను కేసీఆర్ నిలబెట్టుకోలేదని విమర్శించారు. టీఆర్ఎస్తో పొత్తు, విలీనం ఉంటుందని మేం ఎప్పుడు చెప్పలేదన్నారు. అయిన టీఆర్ఎస్తో పొత్తు తమకు అవసరం లేదన్నారు. టీఆర్ఎస్ పునర్ నిర్మాణం అంటే గడీల నిర్మాణమేనని ఆయన అభివర్ణించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని పూర్తి నమ్మకం తమకుందన్నారు. తెలంగాణపై ఇచ్చిన మాటకు కట్టుబడిన ఘనత యూపీఏ అధ్యక్షురాలు సోనియాగాంధీదని దామోదర రాజనర్సింహా ఈ సందర్భంగా గుర్తు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement