కృష్ణాలో కరోనా పంజా.. ఒక్క రోజే 18 | Coronavirus: Positive Cases Rises 600 In Andhra Pradesh | Sakshi
Sakshi News home page

కరోనా: ఏపీలో మరో 31.. మొత్తం 603

Apr 18 2020 11:02 AM | Updated on Apr 18 2020 12:47 PM

Coronavirus: Positive Cases Rises 600 In Andhra Pradesh - Sakshi

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా మరో 31 కరోనా కేసులు నమోదయ్యాయి.

సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా మరో 31 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 603కు చేరుకుంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో జరిగిన కరోనా నిర్దారణ పరీక్షల్లో 31 మందికి పాజిటివ్‌గా తేలింది. ఇందులో ఒక కృష్ణా జిల్లాలోనే 18 కొత్త కేసులు నమోదు కావడంతో జిల్లా అధికార బృందం అప్రమత్తమైంది. రాష్ట్రంలో ఇప్పటివరకు 42 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్‌ కాగా 15 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 546 యాక్టీవ్‌ కేసులు ఉన్నాయి. కర్నూలు(129), గుంటూరు(126) జిలాల్లో అత్యధికంగా కోవిడ్‌-19 కేసులు నమోదయ్యాయి.   

చదవండి:
కరోనా కట్టడిలో ఏపీ భేష్

ఏపీ: లక్ష కిట్లు వచ్చాయ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement