వాళ్ల వేధింపులే సాయిశ్రీ మృతికి కారణం | congress demonds enquiry of Cancer Patient Sai Sri Dies | Sakshi
Sakshi News home page

వాళ్ల వేధింపులే సాయిశ్రీ మృతికి కారణం

May 15 2017 5:41 PM | Updated on Mar 18 2019 9:02 PM

ఈ సంఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుని బాబు తన చిత్తశుద్ది నిరూపించుకోవాలి..

విజయవాడ: చంద్రబాబు పాలనలో సంక్షేమ, ఆరోగ్య రక్ష వంటి పథకాలు అమలు కావడం లేదని, అందుకు నిదర్శనమే మాధవశెట్టి సాయిశ్రీ మృతి అని ఏపీ మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ ఓ ప్రకటనలో డిమాండ్‌ చేశారు. సాయిశ్రీ మృతికి టీడీపీ ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు.  టీడీపీ పాలనలో ఎన్టీఆర్‌ ఆరోగ్యశ్రీ, ఆరోగ్య రక్ష వంటి పథకాలు ప్రచారం చేసుకోవడమే తప్ప అమలు కావడం లేదని ఆమె విమర్శించారు.

రాష్ట్ర రాజధానిలో చిన్నారి తనను బతికించమని వేడుకుంటే, స్థానిక ఎమ్మెల్యే అనుచరుల ఆగడాలతో ఎటువంటి సాయం అందలేదన్నారు. ప్రపంచ విషయాలు తన డ్యాష్‌ బోర్డులో చూసే బాబుకు రాజధానిలోని చిన్నారి వేడుకోలు వినిపించకపోవడం ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు. టీడీపీ పాలనలో చిన్నారి రోదన అరణ్య రోదనైందనీ, ఈ సంఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుని బాబు తన చిత్తశుద్ది నిరూపించుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement