రాజధాని గ్రామాల ఘటనపై చంద్రబాబు దిగ్ర్భాంతి | chandrababu naidu phone call to guntur district collector over lands brunts issue | Sakshi
Sakshi News home page

రాజధాని గ్రామాల ఘటనపై చంద్రబాబు దిగ్ర్భాంతి

Dec 29 2014 10:13 AM | Updated on Oct 1 2018 2:00 PM

గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలోని రాజధాని గ్రామాల్లో... దుండగుల దుశ్చర్యపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.

గుంటూరు : గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలోని రాజధాని గ్రామాల్లో... దుండగుల దుశ్చర్యపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఈ సంఘటనపై ఆయన సోమవారం ఉదయం గుంటూరు జిల్లా కలెక్టర్తో ఫోన్లో మాట్లాడారు. పంటలు తగులబెట్టిన ఘటనపై సమగ్ర నివేదిక ఇవ్వాలని చంద్రబాబు సందర్భంగా కలెక్టర్ను సూచించారు. అలాగే నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మరోవైపు జిల్లా కలెక్టర్తో పాటు ఎస్పీ కూడా సంఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితిపై సమీక్షించనున్నారు.

కాగా రాజధానికి భూములు ఇవ్వడానికి నిరాకరిస్తున్న గ్రామాల్లో దుండగులు అరాచకం సృష్టించిన విషయం తెలిసిందే. గడ్డివాములు, కూరగాయల తోటల పందిళ్లు, గుడిసెలకు నిప్పు పెట్టారు. పెనుమాక, ఉండవల్లి, వెంకటపాలెం, ఉద్దండరాయునిపాలెం, మందడంలో ఈ సంఘటన చోటుచేసుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement