మాచర్ల ఎమ్మెల్యే పీఆర్కే
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో 200 మంది చేరిక
కారంపూడి : రాష్ట్ర ప్రజలు చంద్రబాబుకు ముఖ్యమంత్రిగా కొనసాగేందుకు సుదీర్ఘ కాలం అవకాశం ఇచ్చారని, ఆయన అనుభవం పెరిగేకొద్దీ పాలనలో ఘోరంగా విఫలమవుతున్నారని మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. ఒప్పిచర్ల గ్రామంలో ఆదివారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా పక్షపాత పాలనకు చంద్రబాబు తెరతీశారని ఆయన అన్నారు. అన్నీ అయిన వారికే అన్న చందంగా పాలన సాగిస్తూ ఏ పార్టీకి చెందని సామాన్య ప్రజల గురించి పట్టించుకోవడం మానేశారని మండిపడ్డారు.
జన్మభూమి కమిటీల ద్వారా టీడీపీ కార్యకర్తలకు మేలు చేస్తూ, సామాన్య ప్రజలను విస్మరిస్తున్నారని విమర్శించారు. చివరకు ఎమ్మెల్యేలకు అందించే ఏసీడీపీ గ్రాంటులను కూడా రెండేళ్లుగా ఇవ్వడం లేదన్నారు. అభివృద్ధి చూసి ఎమ్మెల్యేలు పార్టీలోకి వస్తున్నారని చంద్రబాబు చెప్పేదే నిజమైతే, వారితో రాజీనామా చేయించి మళ్లీ ప్రజా తీర్పు కోరాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పార్టీ మండల కన్వీనర్ రామకృష్ణయ్య, మాజీ ఎంపీపీ పంగులూరి చినవెంకటనర్సయ్య పాల్గొన్నారు.
వైఎస్సార్ సీపీలోకి టీడీపీ కార్యకర్తలు
ఒప్పిచర్ల శివారు ఎర్రపాలెం గ్రామానికి చెందిన 200 మంది టీడీపీ కార్యకర్తలు, అభిమానులు ఆదివారం ఎమ్మెల్యే పీఆర్కే సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరారు. వారి ఇళ్లకు ఎమ్మెల్యే వెళ్లి పలకరించి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కండువాలు కప్పి పార్టీలో చేర్చుకున్నట్లు ప్రకటించారు. పార్టీ మండల కన్వీనర్ పంగులూరి రామకృష్ణయ్య, గ్రామ అధ్యక్షుడు ఆముదాలపల్లి రవి తదితర నాయకుల సమక్షంలో గ్రామస్తులను ఎమ్మెల్యే పార్టీలోకి ఆహ్వానించారు. టీడీపీ ఆవిర్భావం నుంచి మరో పార్టీకి ఓటు వేసి ఎరుగని ఎర్రపాలెం గ్రామస్తులు భారీ సంఖ్యలో వైఎస్సార్ సీపీలో చేరడంపై స్థానిక నాయకులు ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం పీఆర్కే మాట్లాడుతూ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఎల్లప్పుడు అందుబాటులో ఉంటానన్నారు.
చంద్రబాబు విఫలం
Published Mon, Mar 7 2016 3:22 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement