నెల్లూరు జిల్లాలో కార్ల దొంగను పోలీసులు అరెస్టు చేశారు. జిల్లాలోని ఎ.ఎస్పేట మండలంలో సోమవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది.
ఎ.ఎస్పేట (నెల్లూరు) : నెల్లూరు జిల్లాలో కార్ల దొంగను పోలీసులు అరెస్టు చేశారు. జిల్లాలోని ఎ.ఎస్పేట మండలంలో సోమవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల ప్రకారం... గుంటూరు జిల్లా చుండూరు మండల కేంద్రానికి చెందిన శ్రీనివాసరెడ్డి పలు రాష్ట్రాల్లో కార్లు చోరీ చేసేవాడు. అయితే నిందితుడిని పోలీసులు నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలంలో అదపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి రెండు కార్లు స్వాధీనం చేసుకుని ఆత్మకూరు కోర్టులో ప్రవేశపెట్టారు.