నాటు బాంబులు పేలి కార్మికులకు గాయాలు | Bombs exploded and injuries to workers | Sakshi
Sakshi News home page

నాటు బాంబులు పేలి కార్మికులకు గాయాలు

Jul 30 2015 4:40 AM | Updated on Aug 21 2018 5:51 PM

బండను చీల్చడాని కి అమర్చిన నాటు బాంబులు ప్రమాదవశాత్తు పేలడంతో ఇద్దరు బండ కార్మికులు తీవ్రంగా

మదనపల్లె రూరల్ : బండను చీల్చడాని కి అమర్చిన నాటు బాంబులు ప్రమాదవశాత్తు పేలడంతో ఇద్దరు బండ కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సం ఘటన బుధవారం మదనపల్లె మండలంలోని చీకలబైలు గ్రామంలో జరిగిం ది. ఘటనకు సంబంధించి బాధితులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉ న్నాయి. బార్లపల్లెకు చెందిన శేఖర్ (42), అదే ఊరికి చెందిన మరో కార్మికుడు దగ్గలప్ప(30) బండలు కొట్టి పు నాది రాళ్లను తీసేవారు. ఈ క్రమంలో రోజు మాదిరిగానే బుధవారం ఉద యం ఊరికి సమీపంలోని గుట్ట దగ్గరకు బండలు తీయడానికి వెళ్లారు. ముం దుగా బండలను పేల్చడానికి రంధ్రాలు వేసి నాట్లు అమర్చుకున్నారు.

పేల్చడానికి ముందు బండపైన కార్మికులు ఎ వ్వరూ లేకుండా చూసి ఆ తర్వాత చు ట్టుపక్కల ఉన్న జనాలను దూరం వెళ్లమని హెచ్చరిస్తారు. ఈ క్రమంలో ప్ర మాదవశాత్తు  బ్యాటరీని ఆన్ చేయడం తో ఒక్కసారిగా నాట్లు పేలి బండపైనే వున్న కార్మికులు శేఖర్, దగ్గప్పకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 సిబ్బంది బాధితులను వెంటనే మదనపల్లె ప్రభుత్వ ఆ స్పత్రికి తరలించారు. పరిస్థితి విష మంగా ఉండడంతో ప్రథమ చికిత్సఅనంతరం వైద్యుల సూచన మేరకు  ఇద్దరిని తిరుపతికి తరలించారు. రూరల్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement