కర్నూలులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త ఎస్వీ మోహన్రెడ్డి ఆధ్వర్యంలో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం వద్ద ధర్నా చేశారు. అదే విధంగా రాజ్విహార్ సెంటర్, పాతబస్టాండ్, బళ్లారి చౌరస్తా వద్ద ధర్నాలు చేశారు.
కర్నూలులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త ఎస్వీ మోహన్రెడ్డి ఆధ్వర్యంలో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం వద్ద ధర్నా చేశారు. అదే విధంగా రాజ్విహార్ సెంటర్, పాతబస్టాండ్, బళ్లారి చౌరస్తా వద్ద ధర్నాలు చేశారు. పాణ్యం పరిధిలో జిల్లా పార్టీ కన్వినర్ గౌరు వెంకటరెడ్డి, సమన్వయకర్త గౌరు చరిత ఆధ్వర్యంలో ర్యాలీ, రాస్తారోకో నిర్వహించి రహదారులపై బైఠాయించారు.
నంద్యాల చెక్పోస్టు వద్ద రహదారిపై బైఠాయించి వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. నగరాన్ని దిగ్భందించటంతో ద్విచక్ర వాహనాలు కూడా తిరగలేకపోయాయి. దీంతో జనం కాలినడకన గమ్యస్థానాలకు చేరుకున్నారు. నంద్యాలలో పార్టీ కేంద్రపాలక మండలి సభ్యుడు భూమా నాగిరెడ్డి ఆధ్వర్యంలో పట్టణాన్ని దిగ్భందించారు. ర్యాలీలు, రాస్తారోకోలు, మానవహారాలు నిర్వహించి నిరసన తెలియజేశారు. అనంతరం ఆళ్లగడ్డకు చేరుకొని అక్కడ ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి దీక్ష విరమింపజేసి ర్యాలీ నిర్వహించారు. నాలురోడ్లకూడలిలో భూమా దంపతులు సోనియా, చంద్రబాబు నాయుడు దిష్టిబొమ్మలను తగులబెట్టి బంద్ను విజయవంతం చేశారు. కర్నూలు జాతీయరహదారిపై ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. బనగానపల్లిలో ఎర్రబోతుల వెంకటరెడ్డి చేస్తున్న దీక్షను ఎంపీ ఎస్పీవెరైడ్డి విరమింపజేశారు. అక్కడ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. బైక్ర్యాలీ, ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. డోన్లో బుగ్గన రాజేంధ్రనాథ్రెడ్డి ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. పత్తికొండ సమన్వయకర్త కోట్ల చక్రపాణిరెడ్డి ఆధ్వర్యంలో వెల్దుర్తిలో జాతీయరహదారిని దిగ్భందించారు. కోడుమూరులో మణిగాంధీ ఆధ్వర్యంలో ర్యాలీ, రాస్తారోకో, ధర్నా నిర్వహించి షాపులను మూయించారు. మంత్రాలయంలో బాలనాగిరెడ్డి, ప్రదీప్రెడ్డి ఆధ్వర్యంలో కర్ణాటకకు వెళ్లే రహదారిని దిగ్భందించారు. అదే విధంగా బ్యాంక్ ఎదుట ఆందోళన చేశారు. ఎమ్మిగనూరులో జగన్మోహనరెడ్డి దీక్ష విరమించారు. ఆదోనిలో సాయిప్రసాద్రెడ్డి ఆధ్వర్యంలో బంద్ విజయవంతమైంది. ఆలూరులో గుమ్మనూరు జయరాం అధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలని మూయించారు. అనంతరం రోడ్డుపై బైఠాయించి రాకపోకలను అడ్డుకున్నారు. నందికొట్కూరులో వైఎస్సార్సీపీ నేత బండి జయరాజ్ ఆమరణ నిరాహారదీక్షను పోలీసులు భగ్నం చేశారు.