కారు ఢీకొని బీటెక్ విద్యార్థి దుర్మరణం | B Tech Student Dies In A Road Accident at Chittoor District | Sakshi
Sakshi News home page

కారు ఢీకొని బీటెక్ విద్యార్థి దుర్మరణం

Feb 7 2016 6:33 PM | Updated on Aug 30 2018 3:58 PM

చిత్తూరు జిల్లాలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వైఎస్సార్ జిల్లాకు చెందిన బీటెక్ విద్యార్థి మృతి చెందాడు.

చిత్తూరు: చిత్తూరు జిల్లాలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వైఎస్సార్ జిల్లాకు చెందిన బీటెక్ విద్యార్థి మృతి చెందాడు. చుండుపల్లి మండలం కుప్పగుట్టకు చెందిన గోపీనాయక్ తిరుపతిలో బీటెక్ చదువుతున్నాడు.

ఆదివారం కావడంతో బైక్పై ఇంటికి వస్తున్న క్రమంలో చిత్తూరు జిల్లా చిన్నగొట్టికల్లు వద్ద కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన గోపినాయక్ ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement