నా పేరు వెంకటరామరాజు. మాది రైల్వే కోడూరు. రోడ్డు ప్రమాదంలో దివ్యాంగుడిగా మారాను. 69 శాతం వికలత్వం ఉండడంతో నాకు పింఛన్ మంజూరు చేయాలని కోరడంతో పింఛన్ మంజూరు చేశారు. అయితే దివ్యాంగుడుగా ఉన్నప్పటికీ వితంతువు పింఛన్ మంజూరు చేశారు. ఆ విషయం ముందు నాకు తెలియదు. ఆ తర్వాత తెలవడంతో వితంతువు పింఛన్ రూ.4 వేలు.. దివ్యాంగుడి పింఛన్గా మార్పు చేయాలని క్షేత్ర స్థాయి అధికారుల నుంచి మండల, డివిజన్ చివరికి కలెక్టరేట్ అధికారుల చుట్టూ తిరుగుతున్నాను. అర్జీలిస్తున్నా ఎవ్వరూ పట్టించుకోవడం లేదు.
– తిరుపతి అర్బన్


