రంపచోడవరం(పోలవరం జిల్లా): అడ్డ తీగలలో టీడీపీ సమావేశంలో కార్యకర్తలపై ఆ పార్టీకే చెందిన రంపచోడవరం ఎమ్మెల్యే శిరీష దేవి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు తాటతీస్తానంటూ కార్యకర్తలను హెచ్చరించారు. ‘పనిచేయరు... ఓట్లు వేయించలేరు..... తిరిగి తమపై హైకమండ్ కు ఫిర్యాదు చేస్తారా’ అంటూ కార్యకర్తలపై చిందులు తొక్కారు. ఏమైనా కార్యక్రమం జరిగితే ఒక్కడైనా ఫ్లెక్సీలు కట్టిస్తున్నాడా ఆగ్రహం వ్యక్తం చేశారు శిరీష.
ఎమ్మెల్యే శిరీష్. ఎమ్మెల్యే శిరీష వ్యాఖ్యలతో రంపచోడవరం టీడీపీ క్యాడర్లో కలకలం మొదలైంది. తమను ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదని సీనియర్ కార్యకర్తలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ కోసం పనిచేసిన వారికి ఎమ్మెల్యే వ్యాఖ్యలు అవమానకరంగా ఉందంటూ కొందరు నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి: ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డికి షాక్?


