సాక్షి, ఆంధ్రప్రదేశ్: వాతావారణ శాఖ రాష్ట్రానికి వర్ష హెచ్చరికలు జారీ చేసింది. విజయనగరం, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, విశాఖ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అదే విధంగా గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయడంతో పాటు పిడుగులు పడే అవకాశం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఈదురుగాలుల నేపథ్యంలో చెట్లకింద, ఎలక్ట్రిక్ వైర్ల వద్ద నిల్చోవద్దని వాతావరణ శాఖ సూచనలు జారీ చేసింది.


