టీడీపీతో పొత్తు పెట్టుకొని నష్టపోయాం: బీజేపీ | Sakshi
Sakshi News home page

టీడీపీతో పొత్తు పెట్టుకొని నష్టపోయాం: బీజేపీ

Published Thu, Sep 5 2019 6:35 PM

AP BJP Chief Kanna Laxminarayana Comments On TDP In Guntur - Sakshi

సాక్షి, గుంటూరు : టీడీపీ, ఎంఆర్పీఎస్‌ కార్యకర్తలు గురువారం బీజేపీలో చేరారు. వీరిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ పార్టీ కండువా కప్పి ఆహ్మనించారు. కేంద్రంలో మోడీ పరిపాలనకు ప్రజలు ఆకర్షితులవుతున్నారని, అందుకే అధిక సంఖ్యలో బీజేపీలో చేరుతున్నారని తెలిపారు. పేదరిక నిర్మూలనే బీజేపీ సిద్దాంతామని పేర్కొన్నారు. పార్టీ సభ్యత్వాల సంఖ్యను ఈసారి మరింత పెంచగలిగామని, టీడీపీలో జరిగిన అవినీతి, అక్రమాలపై ప్రభుత్వం దృష్టి సారించాలని కోరారు. గతంలో టీడీపీతో పొత్తు పెట్టుకొని రెండు సార్లు నష్టపోయామని, ఇక నుంచి స్వయంగానే ఎన్నికల్లో పోటీ చేస్తామని స్పష్టం చేశారు.

Advertisement
Advertisement