పీసీసీ మాజీ చీఫ్, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణకు ఊహించని దెబ్బ పడింది. తన వెన్నంటే ఉంటారనుకున్న జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి కాంగ్రెస్ పార్టీని వీడారు.
సాక్షి ప్రతినిధి, విజయనగరం: పీసీసీ మాజీ చీఫ్, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణకు ఊహించని దెబ్బ పడింది. తన వెన్నంటే ఉంటారనుకున్న జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి కాంగ్రెస్ పార్టీని వీడారు. వైఎస్ఆర్ కాంగ్రె స్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో శుక్రవారం ఆయన ఆ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీతో సఖ్యతగా ఉన్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులనాయుడు కూడా జగన్మోహన్రెడ్డిని కలిశారు. వైఎస్సార్సీపీకి మద్దతిస్తున్న ట్టు ప్రకటించారు. దీంతో జిల్లా కాంగ్రెస్ పార్టీలో బొత్స కుటుంబం తప్ప మరెవరూ కనిపించడం లేదు.
కీలక నేతలు ఒక్కొక్కరూ బొత్సతో తెగతెంపులు చేసుకుంటున్నారు. దీంతో ఆయన రాజకీయంగా ఏకాకి అయ్యా రు. ఇప్పటికే ప్రధాన అనుయాయుడు, ఎచ్చెర్ల ఎమ్మెల్యే మీసాల నీలకంఠం నాయుడు, ప్రధాన అనుచరుడు జెడ్పీ మాజీ చైర్మన్ బెల్లాన చంద్రశేఖర్ బొత్సకు రాం రాం చెప్పేసి వైఎస్సార్ సీపీలో చేరిపోయారు. ఇక డీసీసీబీ ఉపాధ్యక్షుడు చనుమల్ల వెంకటరమణ, ఏఎంసీ చైర్మన్ అంబళ్ల శ్రీరాముల నాయుడుతో పాటు వందలాది మంది ద్వితీయ శ్రేణి నాయకులు ఆయన్ను వదిలేసి వైఎస్సార్ సీపీ తీర్థం పుచ్చుకున్నా రు. తాజాగా ముఖ్యనేత, జిల్లాలో కాంగ్రెస్ పార్టీని నిలబెట్టవలసిన జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి కూడా బొత్సతో కటీఫ్ చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి గుడ్బై చెప్పేసి శుక్రవారం వైఎస్సార్సీపీలో చేరారు.
ఇక కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దయనీయంగా తయారైంది. పైన పేర్కొన్న నేతలతో పాటు మాజీ మంత్రి శత్రుచర్ల విజ యరామరాజు, కురుపాం ఎమ్మెల్యే వి.టి.జనార్దన్ థాట్రాజ్, పార్వతీపురం ఎమ్మెల్యే సవరపు జయమణి, ఎమ్మెల్సీ వాసిరెడ్డి వరదరామారావు, ఎస్.కోట నియోజకవర్గ నాయకులు అల్లు కేశవ వెంకట జోగినాయుడు, సాలూరు నియోజకవర్గ నాయకులు పిన్నింటి ప్రసాద్, పిన్నింటి ఈశ్వరరావు, బొబ్బిలి నియోజకవర్గ నాయకులు అప్పికొండ శ్రీరాములనాయు డు, చొక్కాపు లక్ష్మణరావు, పార్వతీపురం నియోజకవర్గ నాయకులు బీమవరపు కృష్ణమూర్తి, నడిమింటి రామకృష్ణ, బొండు చిట్టిరాజు, నెల్లిమర్ల నియోజకవర్గ నాయకులు కొమ్మూరి సంజీవరావు, కందుల రఘుబాబు, పతివాడ అప్పలనాయుడు, బర్రి చిన్నప్పన్న తదితర నాయకులంతా కాంగ్రెస్ను వదిలేశారు. అత్యధిక మంది వైఎస్సార్సీపీలోనే చేరిపోయారు.
ఫలించని కట్టడి ప్రయత్నాలు
ఇప్పటివరకు వెళ్లిన నాయకులు ఒక వంతైతే కోలగట్ల వీరభద్రస్వామి ఒక్కరూ మరో వంతు. ఆయన అనూహ్యంగా గుడ్బై చెప్పడంతో బొత్స ఒకింత షాక్ తిన్నారు. ఆయన ఉంటే చాలు పార్టీని నిలబెట్టొచ్చని కలలు కన్నారు. జిల్లాలో అన్నీ చూసుకుంటారని ఆశించారు. అయితే, అంచనాలు తలకిందులై కేడర్ ఒత్తిడి మేరకు వైఎస్సార్ సీపీలో చేరేందు కు ఆసక్తి చూపించారు. విషయం తెలుసుకున్న బొత్స, ఆయన మేనల్లుడు మజ్జి శ్రీను(చిన్న శ్రీను) పార్టీ మారాల నుకున్న కోలగట్ల వీరభద్రస్వామిని ఆపేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నించారు.
నాయకులు, కార్యకర్తల మనోభావాల ప్రకారం నడుచుకోవాలన్న ఉద్దేశంతో పునరాలోచనకు వెళ్లకుండా పార్టీ మారాలని వీరభద్రస్వామి నిర్ణయించుకున్నా రు. ఆమేరకు హైదరాబాద్లోని లోటస్ పాండ్లో ఉన్న పార్టీ కార్యాలయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా కండువా వేసుకున్నారు. ఆయనతో పాటు ఇన్నాళ్లు తమకు మద్దతుగా నిలిచిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులనాయుడు కూడా బొత్సకు ఝలక్ ఇచ్చారు. వైఎస్సార్సీపీకి మద్దతిస్తున్నట్టు ప్రకటించి ఆశ్చర్యపరిచారు. ఇక చేసేదేమీలేక మిగతా నాయకులను కాపాడుకునేందుకు మజ్జి శ్రీను రంగంలోకి దిగి శుక్రవారం మధ్యాహ్నం అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
వీరభద్రస్వామి వదిలివెళ్లినా ఉన్న నాయకులమంతా కలిసి కట్టుగా పనిచేసి పార్టీ పటిష్టత కోసం పనిచేయాలని కోరారు. ఈ సందర్భంగా అత్యధిక మంది నాయకులు కోలగట్ల బాటే పడతామని, ఆయన గురించి వేరేలా మాట్లాడటం తగదని ముఖం మీదే చెప్పేసినట్టు తెలిసింది. దీంతో రానున్న రెండు మూడు రోజుల్లో కాంగ్రెస్ నుంచి పెద్ద ఎత్తున వలసలు జరగనున్నాయి. దీంతో కాంగ్రెస్ పార్టీ దాదాపు ఖాళీ కానుంది.