ఆటోమొబైల్‌ హబ్‌గా ఆంధ్రప్రదేశ్‌ | Andhra Pradesh as the automobile hub | Sakshi
Sakshi News home page

ఆటోమొబైల్‌ హబ్‌గా ఆంధ్రప్రదేశ్‌

Mar 24 2018 1:49 AM | Updated on Aug 14 2018 11:26 AM

Andhra Pradesh as the automobile hub - Sakshi

హీరో మోటార్‌కార్ప్‌ చిత్తూరు ప్లాంటుకు శంకుస్థాపన చేస్తున్న సీఎం

సాక్షి, చిత్తూరు: తిరుపతి, నెల్లూరు, అనంతపురం ప్రాంతాలను కలుపుతూ ఆటోమొబైల్‌ హబ్‌ను ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్‌ స్వర్గధామమని చెప్పారు. చిత్తూరులోని శ్రీసిటీ సమీపంలో శుక్రవారం హీరో మోటార్‌కార్ప్‌ చిత్తూరు ప్లాంటుకు ఆయన శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈజ్‌ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో మన రాష్ట్రం దేశంలోనే రెండోస్థానంలో ఉందన్నారు. పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్‌ అనుౖవైన ప్రాంతమన్నారు. దక్షిణాదిలో మరే రాష్ట్రంలోనూ హీరో ప్లాంటు లేదని తెలిపారు. చిత్తూరు ప్లాంటు నిర్మాణం కోసం రూ.1,600 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నామని హీరో మోటార్‌కార్ప్‌ సీఎండీ పవన్‌ముంజాల్‌ చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement