Sakshi News home page

ఏపీ అసెంబ్లీ ప్రధాన ద్వారాన్ని పగులగొట్టిన వ్యక్తి

Published Wed, Jul 30 2014 10:18 AM

andhra pradesh assembly main door broken

హైదరాబాద్ : అసెంబ్లీ ఆవరణలో మరోసారి భద్రత వైఫల్యం బయటపడింది. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రవేశ ద్వారాన్ని ఓ వ్యక్తి పగులగొట్టాడు. ఈ విషయాన్ని గమనించిన  సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు.

పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అతను ఉద్దేశపూర్వకంగానే ఈ చర్యకు పాల్పడ్డాడా లేక మానసిక స్థితి సరిగ్గా లేక ఈ పని చేశాడా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.
 

(ఇంగ్లీషు కథనం ఇక్కడ చదవండి)

Advertisement

What’s your opinion

Advertisement