కృష్ణాజిల్లా గన్నవరం విమానాశ్రయం నుంచి ఎయిరిండియా విమానయాన సంస్థ మరో నూతన సర్వీసుకు శ్రీకారం చుట్టనుంది.
కృష్ణాజిల్లా గన్నవరం విమానాశ్రయం నుంచి ఎయిరిండియా విమానయాన సంస్థ మరో నూతన సర్వీసుకు శ్రీకారం చుట్టనుంది. హైదరాబాద్ నుంచి గన్నవరం మీదుగా విశాఖపట్నానికి సోమవారం నుంచి ఈ సర్వీసును ప్రారంభించ నుంది. హైదరాబాద్ నుంచి ఉదయం 7.30 గంటలకు గన్నవరం వచ్చే ఈ విమానం 8 గంటలకు విశాఖపట్నానికి బయలుదేరి వెళుతుంది. విశాఖపట్నం నుంచి తిరిగి బయలుదేరి 10.50కి గన్నవరం చేరుకుంటుంది. 11.20కి బయలుదేరి హైదరాబాద్ వెళ్తుంది.