ఎంవీఐ కార్యాలయంపై ఏసీబీ అధికారుల దాడి | ACB traps MVI office officials | Sakshi
Sakshi News home page

ఎంవీఐ కార్యాలయంపై ఏసీబీ అధికారుల దాడి

Oct 29 2013 6:40 AM | Updated on Aug 17 2018 12:56 PM

రాయచోటి మోటారు వెహికల్ అధికారి కార్యాలయంపై సోమవారం ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. కంప్యూటర్ గదితో పాటు అనధికార ఏజెంట్ల వద్ద నుంచి రూ.80,890 స్వాధీనం చేసుకున్నారు.

రాయచోటి, న్యూస్‌లైన్ : రాయచోటి మోటారు వెహికల్ అధికారి కార్యాలయంపై సోమవారం ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. కంప్యూటర్ గదితో పాటు అనధికార ఏజెంట్ల వద్ద నుంచి రూ.80,890 స్వాధీనం చేసుకున్నారు. స్థానిక ఎంవీఐ కార్యాలయంపై సోమవారం తిరుపతి, కడపకు చెందిన ఏసీబీ సీఐలు పార్థసారధిరెడ్డి, రామకిషోర్, సుధాకర్, లక్ష్మికాంత్‌రెడ్డితోపాటు సిబ్బంది ఆకస్మికంగా దాడులు చేశారు. ఎంవీఐ మధుసూదన్‌రెడ్డితో పాటు సిబ్బందిని ప్రశ్నించి రికార్డులను సోదా చేశారు. దాడి సమయంలో కంప్యూటర్ ఆపరేటర్ గదితో పాటు, అనధికార ఏజంట్లు  రమణ, సుబ్బారా వు, రాజశేఖర్‌రెడ్డిల వద్ద నుండి  Rs 80,890లు స్వాధీనం చేసుకున్నారు.

అనంతరం ఏసీబీ సీఐ పార్థసారధిరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ ముందస్తు సమాచారం మేరకే ఎంవీఐ కార్యాలయంపై దాడులు చేశామన్నారు. దాడులలో కార్యాలయంలోని కంప్యూటర్‌గదిలో, అనధికార ఏజెంట్ల వద్ద సుమారు రూ.80,890 స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. పలు రికార్డులను స్వాధీనం చేసుకున్నామని, పట్టుబడ్డ నగదు విషయమై ఉన్నతాధికారులకు నివేదిక అందజేయనున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement