రేపల్లెలో అర్థరాత్రి రెచ్చిపోయిన దొంగలు | 18 shops robbed in Guntur district Repalle | Sakshi
Sakshi News home page

రేపల్లెలో అర్థరాత్రి రెచ్చిపోయిన దొంగలు

Nov 8 2013 10:15 AM | Updated on Aug 30 2018 5:27 PM

గుంటూరు జిల్లా రేపల్లెలో అర్థరాత్రి దొంగలు రెచ్చిపోయారు. వరుస చోరీలకు పాల్పడి, అందినకాడికి దోచుకుని ఉడాయించారు.

గుంటూరు : గుంటూరు జిల్లా రేపల్లెలో అర్థరాత్రి దొంగలు రెచ్చిపోయారు. వరుస చోరీలకు పాల్పడి, అందినకాడికి దోచుకుని ఉడాయించారు. పట్టణంలో 18 దుకాణాల తాళాలు పగులగొట్టి దొరికినంతా దోచుకెళ్లారు. విలువైన వస్తువులు, నగదు ఎత్తుకెళ్లారు. పోలీసుస్టేషన్‌ పక్కనే ఉన్న దొంగతనం జరగడంపై షాపు యజమానులు ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకుని సంఘటన స్థలానికి వచ్చిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. త్వరలోనే దొంగలను పట్టుకుంటామని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement