15 నుంచి సుప్రభాత సేవ | 15 suprabhata service | Sakshi
Sakshi News home page

15 నుంచి సుప్రభాత సేవ

Jan 11 2015 1:08 AM | Updated on Nov 9 2018 6:29 PM

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో ఈనెల 15వ తేదీ నుంచి సుప్రభాతసేవను పునఃప్రారంభించనున్నారు.

సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో ఈనెల 15వ తేదీ నుంచి సుప్రభాతసేవను పునఃప్రారంభించనున్నారు. గత నెల 16న ధ నుర్మాసం ప్రారంభమైన రోజు నుంచి ఆలయంలో సుప్రభాతసేవకు బదులు గోదాదేవి విరచిత తిరుప్పావై పాశురాలను పారాయణం చేస్తున్నారు. ధనుర్మాసం 14వ తేదీతో ముగియనుండడంతో 15న సుప్రభాతసేవను పునఃప్రారంభించనున్నారు. ఈ నెల 16వ తేదీ పారువేట ఉత్సవం నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఉత్సవమూర్తులను ఆలయానికి మూడు కిలోమీటర్ల దూరంలోని పారువేట మండపం వద్దకు తీసుకునివెళ్లి వేట కార్యక్రమం నిర్వహిస్తారు.
 
తొమ్మిది గంటల్లో శ్రీవారి దర్శనం

తిరుమలలో గురువారం భక్తుల రద్దీ తగ్గింది. సాయంత్రం 6 గంటల వరకు మొత్తం 38,130 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఇదే సమయానికి సర్వదర్శనం కోసం 16 కంపార్ట్‌మెంట్లలో ఉన్న భక్తులకు 9 గంటలు, కాలిబాట భక్తులకు 4 గంటల్లో దర్శనం లభించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement