● ముచ్చుమర్రి లిఫ్ట్‌, మైలవరం నుంచి నీరివ్వాలని డిమాండ్‌ | - | Sakshi
Sakshi News home page

● ముచ్చుమర్రి లిఫ్ట్‌, మైలవరం నుంచి నీరివ్వాలని డిమాండ్‌

Mar 22 2025 1:32 AM | Updated on Mar 22 2025 1:28 AM

మైదుకూరు, చాపాడు ఛానల్స్‌కు తెలుగుగంగలో భాగమైన వెలుగోడు రిజర్వాయర్‌ నుంచి సాగునీరు అందించాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు. వెలుగోడులో 4.4 టీఎంసీల నీరు మాత్రమే ఉందని అధికారులు చెబుతున్నప్పటికీ అర టీఎంసీ నీటిని మళ్లిస్తే సరిపోతుందని రైతులు అంటున్నారు. శ్రీశైలం వెనుక జలాల్లో ఏర్పాటు చేసినా ముచ్చు మర్రి లిఫ్ట్‌ నుంచి 750 క్యూసెక్కులు ఇచ్చేందుకు చర్యలు తీసుకున్నా సరిపోతుందంటున్నారు. అయితే ముచ్చుమర్రి నుంచి లిఫ్ట్‌ ద్వారా ఇస్తున్న నీరు నంద్యాల జిల్లా చివరి ఆయకట్టు ప్రాంతమైన ఆళ్లగడ్డ, ఉయ్యాలవాడ, దొర్నిపాడు, చాగలమర్రి ప్రాంతాలకే సరిపోతుందని అధికారులు అంటున్నా రు. పైగా కుందూ నీటిని మోటార్ల ద్వారా ఎగువ ప్రా ంతరైతులు మళ్లించుకునే అవకాశాలు ఉన్నాయని అధికారుల అభిప్రాయం. ఇకపోతే కడప, చెన్నూరు ఆయకట్టుకు మైలవరం నీటిని ఆదినిమ్మాయపల్లె ఆ నకట్ట ద్వారా అందించాలని రైతులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement