యాదగిరిగుట్ట: రైతులు తీవ్రమైన నష్టాల్లో కూరుకుపోతున్నారని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ప్రధాన కార్యదర్శి పశ్య పద్మ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఆధ్వర్యంలో మూడు రోజుల రాష్ట్రీయ స్థాయి శిక్షణ తరగతులు శనివారం యాదగిరిగుట్ట పట్టణంలో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామీణ మహిళల ఆధ్వర్యంలో నడిచే చిన్న గృహ ఆధారిత పౌల్ట్రీ పారిశ్రమలు దెబ్బతినకుండా ప్రత్యేక రక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. శిక్షణ కార్యక్రమంలో హేమంతరావు, ఉపాధ్యక్షుడు కొప్పుజు సత్యనారాయణ, దొండపాటి రమేష్, కొల్లూరి రాజయ్య, మెడికంటి వెంకట్రెడ్డి, ప్రభు లింగం, దొడ్డ వెంకటయ్య, నెట్టెం నారాయణ, కార్యదర్శులు కందపర్తి గోవిందరావు, వెంకటయ్య, దేవబత్తుని సంధ్య, నరేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు.


