భువనగిరి : పీఆర్సీ తక్షణమే ప్రకటించి పెండింగ్ బిల్లులను చెల్లించాలని తపస్ జిల్లా అధ్యక్షురాలు రేపాక ఉమా అన్నారు. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం తపస్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన కోసం గ్రాంట్లను విడుదల చేయాలన్నారు. తపస్ జిల్లా కార్యదర్శి ఇరుగు యాదగిరి, సీవీ శ్రీనివాస్, శ్రీధర్, శంకర్రెడ్డి, వెంకటేశ్వర్లు, రాజు, లక్ష్మణ్ పాల్గొన్నారు.


