లారీని ఢీకొట్టిన బస్సు | - | Sakshi
Sakshi News home page

లారీని ఢీకొట్టిన బస్సు

Jun 5 2025 2:08 AM | Updated on Jun 5 2025 2:08 AM

లారీన

లారీని ఢీకొట్టిన బస్సు

చౌటుప్పల్‌ రూరల్‌: చౌటుప్పల్‌ మండలం ఖైతాపురం గ్రామ స్టేజీ సమీపంలో హైదరాబాద్‌– విజయవాడ జాతీయ రహదారిపై బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేట్‌ ట్రావెల్‌ బస్సు ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టడంతో బస్సు డ్రైవర్‌తో పాటు బస్సులో ఉన్న ఓ ప్రయాణికురాలు మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా కందుకూరు నుంచి శివాంజలి ప్రైవేట్‌ ట్రావెల్‌ బస్సు 34 మంది ప్రయాణికులతో హైదరాబాద్‌కు బయలుదేరింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం ఖైతాపురం గ్రామ సమీపంలోకి వచ్చే సరికి జాతీయ రహదారి పక్కన ఆగి ఉన్న ఓ ట్రాలీ లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు ముందు భాగం నుజ్జునుజ్జయింది. ప్రకాశం జిల్లా జిరుగుమల్లి మండలం చిర్రిపాడు గ్రామానికి చెందిన బస్సు డ్రైవర్‌ కొండల్‌రావు(42) బస్సు క్యాబిన్‌లో ఇరుక్కుపోయి తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. డ్రైవర్‌ వెనుక సీటులో కూర్చున్న ప్రకాశం జిల్లా పొన్నులూరు మండలం పరుచూరివారిపాలెం గ్రామానికి చెందిన దండిబోమిన గోవిందమ్మ(47)కు తీవ్రగాయాలు కాగా చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది. మృతురాలు గోవిందమ్మకు కుమార్తె, కుమారుడు ఉన్నారు. వారిద్దరితో కలిసి హైదరాబాద్‌లో బంధువుల ఇంటి వద్ద ఫంక్షన్‌ ఉండడంతో కుందుకూరు నుంచి బస్సులో వెళ్తోంది.

డ్రైవర్‌ నిద్రమత్తులో ఉన్నట్లు

ప్రాథమికంగా గుర్తించిన పోలీసులు

బస్సు ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 34 మంది ఉండగా అందులో 18మందికి గాయాలయ్యాయి. ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం దొడ్డవరం గ్రామానికి చెందిన పోకూరు భుజంగరావు, చేగూర్తి మండలం బొస్రపల్లికి చెందిన బండారి వినోద్‌, గుర్బసాల సుజాత, జనుగుపల్లి మండలం పాల్వాయి గ్రామానికి చెందిన వంజ అంకమ్మ, బీమకుర్తి మండలం నాయుడుపాలెం గ్రామానికి చెందిన పులి సన్ని, వల్లెటిపాలెం మండలం నందలపర్‌ గ్రామానికి చెందిన సుశీల, పోకూరు గ్రామానికి చెందిన పల్లపు శివమ్మ, భూపాలపురం గ్రామానికి చెందిన ప్రగాడ శ్రీనివాసులు, చండి అయ్యవారిపల్లి గ్రామానికి చెందిన బచ్చు మల్యాద్రి, సుజాత నగర్‌కు చెందిన యనమల మమత, వల్లెటిపాలెం మండలం చిన్నమ్మపాలెం గ్రామానికి చెందిన దేవిళ్ల జయమ్మ, దేవిళ్ల మల్లేశ్వరి, నెల్లూరు జిల్లా కందుకూరు మండల కేంద్రానికి చెందిన యనమల మమత, లింగసముద్రం మండలం తూమగుంట గ్రామానికి చెందిన మీటినేని విజయ,ఉలువపాడు మండలం రామాయపట్నం గ్రామానికి చెందిన అప్పనగిరి సురేష్‌, అప్పనగిరి జ్యోతి, కొత్తపట్నం మండలం పల్లెపాడు గ్రామానికి చెందిన నాయుడు వెంకయ్య, నాయుడు రజని గాయపడినవారిలో ఉన్నారు. వీరిలో కొంతమందిని చికిత్స నిమిత్తం చౌటుప్పల్‌ ప్రభుత్వ ఆస్పత్రి, మరికొంత మందిని హైదరాబాద్‌లోని ఉస్మానియా, హయత్‌నగర్‌లోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన డ్రైవర్‌ కొండల్‌రావు, ప్రయాణికురాలు గోవిందమ్మ మృతదేహాలకు చౌటుప్పల్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాలను వారి బంధువులకు అప్పగించారు. ఈ ప్రమాదంపై మృతురాలు గోవిందమ్మ కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మన్మథకుమార్‌ తెలిపారు. బస్సు ప్రమాద సమయంలో డ్రైవర్‌ నిద్రమత్తులో ఉన్నాడని ప్రాథమికంగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.

ఫ బస్సు డ్రైవర్‌, మహిళా

ప్రయాణికురాలు మృతి

ఫ 18మందికి గాయాలు

ఫ చౌటుప్పల్‌ మండలం

ఖైతాపురం వద్ద ఘటన

లారీని ఢీకొట్టిన బస్సు1
1/2

లారీని ఢీకొట్టిన బస్సు

లారీని ఢీకొట్టిన బస్సు2
2/2

లారీని ఢీకొట్టిన బస్సు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement