
ఇంటికి మూడు డ్రమ్ములే సరఫరా
అధికారులు ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తున్నా నీఇ సమస్య పూర్తిస్థాయిలో పరిష్కా రం కావడం లేదు. ఈ క్రమంలో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. ఒక్కో ఇంటికి మూడు డ్రమ్ముల చొప్పున అందజేస్తున్నారు. ఇవి కూడా క్రమం తప్పకుండా సరఫరా చేయకపోవడంతో జనం నీటి కోసం అల్లాడుతున్నారు. విధిలేని పరిస్థితుల్లో ప్రైవేట్గా కొనుగోలు చేస్తున్నారు. ఇందుకోసం ట్యాంకర్కు రూ.500 నుంచి రూ.600 వరకు వెచ్చిస్తున్నారు. హోటళ్లు, బేకరీలు, దుకాణా లకు మున్సిపాలిటీ నీటి సరఫరా మూడు నెలలుగా నిలిచిపోయింది. ఇందుకు ట్యాంకర్కు రూ.1000నుంచి రూ.1200 వరకు చెల్లి స్తున్నట్లు నిర్వాహకులు వాపోతున్నారు.