రోడ్డు ప్రమాదంలో ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ మృతి | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ మృతి

Apr 22 2025 1:54 AM | Updated on Apr 22 2025 1:54 AM

రోడ్డ

రోడ్డు ప్రమాదంలో ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ మృతి

మునగాల: రోడ్డు ప్రమాదంలో ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ మృతిచెందాడు. ఈ ఘటన విజయవాడ–హైదరాబాద్‌ జాతీయ రహదారిపై మునగాల మండలం ముకుందాపురం శివారులో సోమవారం రాత్రి జరిగింది. ఎస్‌ఐ బి. ప్రవీణ్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం. మునగాల మండల కేంద్రానికి చెందిన నారగాని రాంబాబు(40) కోదాడలో ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. సోమవారం రాత్రి విధులు ముగించుకొని ద్విచక్ర వాహనంపై కోదాడ నుంచి మునగాలకు వస్తుండగా.. మార్గమధ్యలో ముకుందాపురం వద్ద ముందు ఉన్న కారును ఢీకొట్టాడు. ఈ ప్రమాదలో రాంబాబుకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు 108 వాహనంలో సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. మృతుడికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

యువకుడి అదృశ్యం.. కేసు నమోదు

చౌటుప్పల్‌ రూరల్‌: చౌటుప్పల్‌ మండలం కుంట్లగూడెం గ్రామానికి చెందిన యువకుడు అదృశ్యమయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కుంట్లగూడెం గ్రామానికి చెందిన కానుగు శ్రీకాంత్‌ ఫొటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నాడు. ఆదివారం సాయంత్రం తన భార్య విజయలక్ష్మిని చౌటుప్పల్‌ పట్టణంలోని ఆమె తల్లిగారి ఇంటి వద్ద దింపిన శ్రీకాంత్‌ తిరిగి కుంట్లగూడెం వెళ్తానని చెప్పి బయల్దేరాడు. రాత్రి అయినా కూడా శ్రీకాంత్‌ ఇంటికి చేరుకోకపోవడంతో అతడి తమ్ముడు సాయి ఫోన్‌ చేసినా లిఫ్ట్‌ చేయలేదు. బంధువులకు ఫోన్‌ చేసి ఆరా తీసినా శ్రీకాంత్‌ ఆచూకీ తెలియరాలేదు. దీంతో అతడి కుటుంబ సభ్యులు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మన్మథకుమార్‌ తెలిపారు. శ్రీకాంత్‌ నలుపు, లేత నీలం రంగు చొక్కా, తెలుపు రంగు ప్యాంట్‌ ధరించినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.

వేసవిలో ఉపాధ్యాయుల బదిలీలు చేపట్టాలి

టీఎస్‌ యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి సీహెచ్‌. రాములు

సూర్యాపేటటౌన్‌: రాష్ట్రంలోని ప్రభుత్వ ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు వేసవి సెలవుల్లో పూర్తిచేయాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌(టీఎస్‌ యూటీఎఫ్‌) రాష్ట్ర కార్యదర్శి సీహెచ్‌. రాములు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సోమవారం టీఎస్‌ యూటీఎఫ్‌ సూర్యాపేట జిల్లా ఆఫీస్‌ బేరర్స్‌ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. శ్రీమన ఊరు–మన బడ్ఙి పథకంలో పూర్తిచేసిన పనులకు సంబంధించిన బిల్లులను వెంటనే చెల్లించాలని, పెండింగ్‌లో ఉన్న పనులు వెంటనే పూర్తిచేయించేలా ప్రభుత్వం కృషి చేయాలన్నారు. పాఠశాలల్లో పనిచేసే సర్వీస్‌ పర్సనన్స్‌కు వేతన బకాయిలు చెల్లించాలని, పెండింగ్‌లో ఉన్న డీఏ బకాయిలను వెంటనే ప్రకటించాలని, నూతన పీఆర్సీ ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో టీఎస్‌ యూటీఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్‌. అనిల్‌ కుమార్‌, జిల్లా ఉపాధ్యక్షుడు పి. శ్రీనివాసరెడ్డి, జిల్లా కోశాధికారి జి. వెంకటయ్య, జిల్లా కార్యదర్శులు ఆర్‌. దామోదర్‌, ఎన్‌. నాగేశ్వరరావు, వి. రమేష్‌, డి. లాలు, కె. జ్యోతి, డి. శ్రీనివాసచారి తదితరులు పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదంలో ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ మృతి
1
1/2

రోడ్డు ప్రమాదంలో ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ మృతి

రోడ్డు ప్రమాదంలో ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ మృతి
2
2/2

రోడ్డు ప్రమాదంలో ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement