ఎన్‌ఎండీసీ మారథాన్‌లో పతకం | - | Sakshi
Sakshi News home page

ఎన్‌ఎండీసీ మారథాన్‌లో పతకం

Sep 8 2026 12:23 AM | Updated on Sep 8 2026 12:23 AM

ఎన్‌ఎండీసీ మారథాన్‌లో పతకం

వీరవాసరం : హైదరాబాద్‌లో ఎన్‌ఎండీసీ (నేషనల్‌ మినరల్‌ డెవలప్మెంట్‌ కార్పొరేషన్‌) ఆధ్వర్యంలో నిర్వహించిన మారథాన్‌లో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఆర్మ్‌డ్‌ రిజర్వు కానిస్టేబుల్‌ ఆర్‌పీసీ 2386 శీలబోయిన వెంకట సత్యప్రసాద్‌ అద్భుత ప్రతిభ కనబరిచారు. 42.2 కిలోమీటర్ల ఫుల్‌ మారథాన్‌ను ఆయన 3 గంటల 46 నిమిషాల్లో పూర్తి చేసి ఫినిషర్‌ పతకాన్ని సాధించారు. ఈ మారథాన్‌లో 10 కేఎం, 21.1 కేఎం, 42.2 కేఎం విభాగాల్లో అంతర్జాతీయ రన్నర్లతో పాటు దేశవ్యాప్తంగా సుమారు 32 వేల మంది పాల్గొన్నారు. గత ఏడాది జరిగిన మారథాన్‌లో ఈ దూరాన్ని 4 గంటల 19 నిమిషాల్లో పూర్తి చేసిన సత్యప్రసాద్‌, ఈసారి మరింత మెరుగైన ప్రతిభ కనబరుస్తూ కేవలం 3 గంటల 46 నిమిషాల్లోనే లక్ష్యాన్ని చేరుకున్నారు. తన టైమింగ్‌ను మెరుగుపరుచుకుని మారథాన్‌ విజయవంతంగా పూర్తి చేసిన కానిస్టేబుల్‌ సత్యప్రసాద్‌ను జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ఎస్పీ అద్నాన్‌ నయీమ్‌ అష్మి సోమవారం ప్రత్యేకంగా అభినందించినట్లు సత్యప్రసాద్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement