–8లో
రెవెన్యూ సమస్యలే అధికం..
ప్రజా సమస్యల పరిష్కార వేదికకు రెవెన్యూ పరమైన సమస్యలే అధికంగా వస్తున్నాయి. పరిష్కారంలో జాప్యమే కారణంగా
తెలుస్తోంది.
జామి మండలం అలమండ గ్రామంలో హుద్హుద్ తుఫాన్ బాధితులకు నిర్మించిన 160 ఇళ్లలో ఇప్పటికీ 27 కుటుంబాలకు పట్టాలు అందలేదంటూ బాధితులు ధర్నా చేశారు. లాటరీ లో పేరొచ్చినా పట్టాలు ఇవ్వకపోవడం, చనిపోయిన లబ్ధిదారుల వారసులకు హక్కులు కల్పించకపోవడం అన్యాయమని వాపోయారు.
సంతకవిటి మండలం మండవ కురిటి గ్రామంలో 1959 నుంచి నేటి వరకు సర్పంచ్ పదవి ఎస్సీలకు రిజర్వ్ కాకపోవడంపై గ్రామస్తులు కలెక్టరేట్ వద్ద ఆందోళన చేశారు. గ్రామంలోని సుమారు 3,000 మంది ఓటర్లలో 600 మంది ఎస్సీ వర్గానికి చెందినవారు ఉన్నప్పటికీ, దశాబ్దాలుగా తమకు ప్రాతినిథ్యం దక్కడం లేదని వాపోయారు.


