
నియామక పత్రాలు అందజేత
విజయనగరం రూరల్: మండల పరిషత్ కార్యాలయాల్లో పరిపాలన అధికారులు, పంచాయతీ విస్తరణ అధికారులుగా విధులు నిర్వహిస్తూ, ఎంపీడీఓలుగా ఉద్యోగోన్నతి పొందిన వారికి జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు తన చాంబర్లో సోమవారం నియామక పత్రాలు అందజేశారు. విజయనగరం మండల పరిపాలనాధికారిగా పనిచేస్తున్న జి.వెంకట రావుకు ఇదే మండలంలో ఎంపీడీఓగా నియ మించారు. సీతానగరం మండల పరిషత్ ఏవోగా విధులు నిర్వహిస్తున్న ప్రసాద్ పాచిపెంట ఎంపీడీఓగా, గుమ్మలక్ష్మీపురం విస్తరణ అధికారి కె.ధర్మారావు జియ్యమ్మవలస ఎంపీడీఓగా నియమిస్తూ ఉత్తర్వులు అందజేశారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ బీవీ సత్యనారాయణ పాల్గొన్నారు.