పర్యావరణహితంగా చవితి జరుపుకుందాం | - | Sakshi
Sakshi News home page

పర్యావరణహితంగా చవితి జరుపుకుందాం

Aug 26 2025 8:22 AM | Updated on Aug 26 2025 8:22 AM

పర్యావరణహితంగా చవితి జరుపుకుందాం

పర్యావరణహితంగా చవితి జరుపుకుందాం

మహారాణిపేట: పర్యావరణానికి హాని చేయని విధంగా వినాయక చవితి వేడుకలు నిర్వహించుకోవాలని కలెక్టర్‌ హరేందిర ప్రసాద్‌ పిలుపునిచ్చారు. పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు సౌజన్యంతో కలెక్టరేట్‌ ఉద్యోగులకు మట్టి వినాయక ప్రతిమలను ఆయన సోమవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్లాస్టిక్‌ వినియోగాన్ని తగ్గించి, పీవోపీ విగ్రహాలను నివారించాలని సూచించారు. చెరువులు, కాలువలు కలుషితం కాకుండా నిమజ్జనం విగ్రహం పెట్టిన చోటే నిర్వహించాలని కోరారు. పీసీబీ సభ్యుడు పంచకర్ల సందీప్‌, జేసీ కె. మయూర్‌ అశోక్‌తో కలిసి కలెక్టర్‌ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement