ఆలయ హుండీలో డాలర్‌ | - | Sakshi
Sakshi News home page

ఆలయ హుండీలో డాలర్‌

Aug 10 2026 7:20 AM | Updated on Aug 10 2026 7:20 AM

ఆలయ హుండీలో డాలర్‌

మొయినాబాద్‌: మున్సిపల్‌ పరిధిలోని హిమాయత్‌నగర్‌ పోచమ్మ ఆలయం హుండీలో ఓ భక్తుడు అమెరికన్‌ డాలర్‌ వేశారు. ఆదివారం బోనాల ఉత్సవాలు నిర్వహించారు. ఉదయం నుంచి భక్తులు బోనాలతో వచ్చి అమ్మవారికి నైవేద్యాలు సమర్పించారు. ఈ సందర్భంగా కొందరు అమ్మవారి హుండీలో కానుకలు సమర్పించారు. ఓ భక్తుడు అమ్మవారి హుండీలో ఒక డాలర్‌ వేశాడు. సాయంత్రం ఆలయ నిర్వాహకులు హుండీ తెరిచి లెక్కించడంతో డాలర్‌ బయటపడింది. అది హుండీలో ఎవరు వేశారోనని స్థానికంగా చర్చ జరుగుతోంది. పరిసర ప్రాంతాల్లోని ఫాంహౌస్‌ల్లో ఉన్నవారు వేసి ఉండొచ్చని భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement