చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య
చేవెళ్ల: షాబాద్లో జరిగిన ఆరు హత్యల ఘటన అమానుషమైనదని ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆటవికంగా మనుషులను పశువులను కోసినట్లుగా కోసి హత్యలు చేయటం దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు. ఇవి పోలీసులు నిర్లక్ష్యంతోనే జరిగిన హత్యలన్నారు. పోక్సో కేసు పెట్టిన తరువాత నిందితుడికి, పోలీసులకు మధ్య జరిగిన కాల్ డేటాను సేకరించాలని, అతడికి సహకరించిన వారిని గుర్తించాలన్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలన్నారు.


