తిరుపతి రూరల్: కంప్యూటర్ ఆధారిత రూప కల్పన (సీఏడీ), త్రిమితీయ (3డీ) ముద్రణ సాంకేతికతల్లో విద్యార్థినులకు ప్రాయోగిక నైపుణ్యాలు అందించేందుకు శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీలో ఐదు రోజుల బూట్ క్యాంప్ను ఈనెల 27న ప్రారంభించారు. అందులో బాగంగా గురువారం కంప్యూటర్ సైన్స్ విభాగం విద్యార్థులకు సీఏడీ ఆధారిత నమూనా రూపకల్పన, 3డీ మోడలింగ్, యాడిటివ్ మాన్యు ఫ్యాక్చరింగ్, డిజైన్ ఆప్టిమైజేషన్, స్లైసింగ్ టెక్నిక్స్, 3డీ ప్రింటర్ నిర్వహణపై సిద్ధాంత, ప్రాయోగిక శిక్షణ అందిస్తున్నారు. యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య వి.ఉమ, నైలిట్ తిరుపతి డైరెక్టర్ శశికుమార్ గెరా మార్గదర్శకత్వంలో జరిగిన శిక్షణను విజయ వంతంగా పూర్తి చేసిన వారికి ధ్రువపత్రాలు అందజేయనున్నారు.


