
ముక్కంటీశుని ఆలయం కిటకిట
తీరంలో సందడి
వాకాడు మండలం తూపిలిపాళెం వద్ద సముద్ర తీరంలో ఆదివారం పెద్దసంఖ్యలో పర్యాటకులు సందడి చేశారు.
ఆనాటి.. ఆ స్నేహమానందగీతం!
శ్రీకాళహస్తి ఆర్పీబీఎస్ జెడ్పీ హైస్కూల్ పూర్వ విద్యార్థులు దాదాపు 31 ఏళ్ల అనంతరం కలుసుకున్నారు.
అధికారిక, అనధికారిక షరతులు ఇవీ..
సోమవారం శ్రీ 16 శ్రీ జూన్ శ్రీ 2025
– 8లో
‘‘సూపర్ సిక్స్ పథకాలతో జీవితాలను మారుస్తాం.. అందులో భాగంగా విద్యార్థుల ఉన్నత భవితకు చేయూతనందిస్తాం.. కుటుంబంలో ఎంతమంది పిల్లలుంటే అందరికీ తల్లివందనం కింద ఏటా రూ.15వేలు అందిస్తాం.. రూ.25వేల కంటే తక్కువ వేతనం పొందే చిరుద్యోగుల బిడ్డలకు సైతం పథకం వర్తింపజేస్తాం.. ఆంక్షలు లేకుండా అర్హులందరికీ నగదు జమ చేస్తాం’’ అంటూ సార్వత్రిక ఎన్నికల సమయంలో చంద్రబాబు ఆర్భాటంగా ప్రకటించారు. చిలక పలుకులు వల్లించి అందరినీ నమ్మించారు. ఏరు దాటాక తెప్ప తగలేసినట్టు.. అధికారంలోకి రాగానే తొలి ఏడాదే సంపద సృష్టి పేరుతో ప్రజలకు పంగనామాలు పెట్టారు. ఇంటా బయటా విమర్శలు వెల్లువెత్తడంతో చేసేది లేక ఈ నెల 12వ తేదీన తల్లివందనానికి శ్రీకారం చుట్టారు. అయితే ఇక్కడే బాబు తన నిజస్వరూపం బయటపెట్టారు. కఠిన షరతులు విధించి వేలాది మంది అమ్మలపై అనర్హత వేటు వేశారు. చాలీ చాలని వేతనాలతో బతుకులు సాగించే కాంట్రాక్ట్.. ఔట్సోర్సింగ్ సిబ్బందికి ఎగనామం పెట్టారు.
ఆంక్షలు లేకుండా
అందించాల్సిందే
కూటమి నేతలు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం ఎటువంటి షరతులు లేకుండా అర్హులైన ప్రతి విద్యార్థికీ తల్లికి వందనం అందించాలి. ఏడాదిగా ఈ పథకం కోసం పేదల విద్యార్థులు ఎంతో ఆత్రుతతో ఎదురు చూశారు. కానీ లేనిపోని షరతులు పెట్టి 50శాతం మందిని అనర్హులుగా ప్రకటించడం దారుణం. పాఠశాలకు వెళ్లే ప్రతి విద్యార్థికీ తల్లికి వందనం అందించి తీరాల్సిందే. పథకాన్ని నీరుగార్చేందుకు యత్నిస్తే ఉద్యమిస్తాం.
– భగత్ రవి, ఎస్ఎఫ్ఐ జిల్లా సెక్రటరీ, తిరుపతి
మెలికలు పెడితే పోరుబాటే
కూటమి సర్కార్ హామీల మీద హామీలు గుప్పించి అధికారం చేపట్టి పథకాలకు మెలికలు పెట్టి అర్హులకు అన్యాయం చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదు. ఒకటో తరగతి నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు చదివే ప్రతి పేద విద్యార్థికీ పథకం అందించాలి. జిల్లాలో బడుగు బలహీన వర్గాలకు చెందిన చాలా మందికి తల్లికి వందనం రాలేదు. సచివాలయాలలో అర్హుల లిస్టును పరిశీలిస్తే అర్థం లేని కారణాలు చూపి అనర్హుల జాబితాలో చేర్చేశారు. ఈ పథకంలో మెలికలు పెడితే పోరుబాట తప్పదు.
– శివశంకర్ నాయక్, జేఎన్ఎస్
రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు, తిరుపతి
పూర్తి స్థాయిలో
అమలు చేయాలి
కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను పూర్తి స్థాయిలో అమలు చేయాల్సిందే. ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోకపోతే ఆ పార్టీలకు మనుగడ కష్టం. తల్లికి వందనం పథకం కింద రూ.15వేలను జిల్లాలో అర్హులైన ప్రతి విద్యార్థి తల్లి ఖాతాలో జమచేయాలి. షరతులు వర్తిస్తాయి అంటూ మహిళలను వంచించడం మానుకోవాలి. లేకుంటే తిరుగుబాటు తప్పదు
– లోకేష్, పీడీఎస్యూ,
జిల్లా కార్యదర్శి, తిరుపతి
తిరుచ్చిపై కల్యాణ వెంకన్న
నారాయణవనం: పద్మావతీ సమేత కల్యాణ వెంకటేశ్వరస్వామి ఆలయంలో శ్రవణోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా సాయంత్రం స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లను తిరుచ్చి వాహనంపై కొలువుదీర్చి మాడవీధుల్లో ఊరేగించారు. ఉదయం స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కల్యాణ వెంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రమైన శ్రవణ గడియల్లో అర్చనలు చేశారు. సాయంత్రం తిరుచ్చి వాహనంపై శ్రీదేవి, భూదేవి సమేత కల్యాణ వెంకటేశ్వరస్వామి తిరుచ్చి వాహనాన్ని అధిరోహించి మాడవీధుల్లో విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. ఆలయానికి చేరుకున్న ఉత్సవర్లకు ఆస్థానం నిర్వహించి నైవేద్యం సమర్పించారు. ఆలయ అధికారి నాగరాజు, ఆర్జితం అధికారి భరత్, ప్రధాన అర్చకులు శ్రీధరభట్టాచార్యులు పర్యవేక్షించారు.
శ్రీవారి దర్శనానికి
20 గంటలు
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్లో కంపార్ట్మెంట్లు నిండాయి. క్యూలైన్ సేవా సంఘం వద్దకు చేరింది. శనివారం అర్ధరాత్రి వరకు 91,720 మంది స్వామివారిని దర్శించుకోగా 44,678 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.80 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 20 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది.
భాషా పండితులకు అన్యాయం
తిరుపతి ఎడ్యుకేషన్ : వెబ్ కౌన్సెలింగ్ ద్వారా మిగిలిపోయిన భాషా పండితులకు చేపట్టిన బదిలీ ప్రక్రియలో పండిట్లకు తీవ్ర అన్యాయం జరిగిందని రాష్ట్ర భాషోపాధ్యాయ సంఘం (ఎస్ఎల్టీఏ) ఉమ్మడి చిత్తూరు అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు దొడ్డ ఉమామహేశ్వర్, సిబ్బాల కిరణ్కుమార్ వాపోయారు. బదిలీ ప్రక్రియలో సీనియారిటీ జాబితాకు అనుగుణంగా ప్రాధాన్యత దృష్ట్యా వెబ్ ఆప్షన్ పెట్టుకున్న సీనియర్లకు దూరంగా, సీనియారిటీ జాబితాలో అట్టడుగున వున్న వారికి సమీప పాఠశాలలు కేటాయించడం దుర్మార్గమని తెలిపారు. దీంతో సీనియర్లు మానసిక ఆవేదనకు గురవుతున్నారని తెలిపారు. తక్షణమే వెబ్ కౌన్సెలింగ్ ద్వారా నిర్వహించిన బదిలీ ప్రక్రియను రద్దు చేసి మాన్యువల్ కౌన్సెలింగ్ నిర్వహించి సీనియర్లకు న్యాయం చేయాలని కోరారు. ప్రతి రెండేళ్లకు బదిలీల్లో స్థానభ్రంశానికి గురవుతున్న వీరికి శాశ్వతంగా న్యాయం చేసేందుకు పదోన్నతులు కల్పించాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వారు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు.
తిరుపతి సిటీ : ఎన్నికల సమయంలో ఓట్ల కోసం సూపర్సిక్స్ అంటూ మభ్యపెట్టి అధికారంలోకి కూటమి ప్రభుత్వం యథేచ్ఛగా ప్రజలను వంచిస్తోంది. ఎటువంటి ఆంక్షలు లేకుండా కుటుంబంలో ఎంతమంది పిల్లలు చదువుతుంటే అందరికీ ఏడాదికి రూ.15వేలు తల్లికి వందనం పథకం కింద అందిస్తామని ఊదరగొట్టింది. తొలి ఏడాది తల్లికి శఠగోపం పెట్టేసింది. ఇప్పుడు పాఠశాలల నిర్వహణ, మరమ్మతుల పేరిట రూ.2వేలు కోత వేసింది. చచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం అని ప్రజలు సర్దిచెప్పుకున్నప్పటికీ పథకాన్ని అరకొరగానే అమలు చేస్తోంది. అందులో భాగంగా కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్, వైద్య శాఖ, ఇతర ప్రభుత్వ శాఖలు, వాటి అనుబంధ సంస్థలలో పనిచేసే సుమారు 50వేల మంది చిరు ఉద్యోగులను అనర్హుల జాబితాలోకి నెట్టేసింది. ఈ మేరకు జిల్లాలో 45శాతం మంది తల్లులను అనర్హులుగా ప్రకటిస్తూ రెండు రోజుల క్రితం సచివాలయాలకు అర్హుల జాబితాను పంపించింది.
అవాక్కవుతున్న తల్లులు
కూటమి ప్రభుత్వం విడుదల చేసిన తల్లికి వందన అర్హులు జాబితాను సచివాలయాలలో ప్రదర్శించారు. అందులో తమ పేరు లేదని అర్హులైన విద్యార్థుల తల్లులు అవాక్కవుతున్నారు. జిల్లాలోని 33 మండలాలలో మండలానికి కనీసం 1,200మందికి తల్లికి వందనం అందకుండా ఆంక్షలు పెట్టి దూరం చేశారు. ఈ క్రమంలో జిల్లావ్యాప్తంగా దాదాపు 1.03మంది విద్యార్థుల తల్లులపై అనర్హత వేటు పడింది. దీంతో గతంలో అమ్మ ఒడి కింద నగదు పొందిన అర్హులైన తల్లులు ఏంచేయాలో పాలుపోక లబోదిబో మంటూ సచివాలయ సిబ్బంది చుట్టూ ప్రదిక్షణలు చేస్తున్నారు. తమకు అన్ని అర్హతలు ఉన్నా తల్లికి వందనం అందకపోవడం దారుణమని, తప్పుడు సమాచారంతో అనర్హుల జాబితాలో పెట్టారని ఆవేధన చెందుతున్నారు.
అర్హులందరికీ అందించాలి
తల్లికి వందనం రూ.15వేలు ఇస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం మాట మార్చింది. రూ.2వేలు కోత పెట్టి రూ.13వేలే ఇస్తోంది. పేదలకు మాయ మాటలు చెప్పి అర్హులకు సంక్షేమ పథకాలను అందించకుండా తప్పుదోవ పట్టించే ప్రయత్నంలో భాగంగానే రాద్ధాంతం చేస్తోంది. అర్హులైన ప్రతి విద్యార్థికీ పథకం అందించి తీరాలి.
– ఆర్.ఆషా, పీడీఎస్ఓ జిల్లా కార్యదర్శి, తిరుపతి
పంగనామం పెట్టేశారు
తల్లికి వందనం అంటూ మహిళల మభ్యపెట్టి ఓట్లు దండుకుని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తల్లికి పంగనామం పెట్టేశారు. అర్హులను సైతం ఏదో ఒక సాకు చూపి అనర్హుల జాబితాలో చేర్చి పేదల తల్లులను మోసం చేశారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అమ్మ ఒడి పథకం ప్రతిష్టాత్మకంగా అమలైంది. మాట ఇచ్చిన ప్రకారం అర్హులైన ప్రతి విద్యార్థి తల్లికీ అందించారు. కూటమి ప్రభుత్వం ప్రాజ వ్యతిరేకతను ఎదుర్కోక తప్పదు. –చెంగల్ రెడ్డి, వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం నేత, చంద్రగిరి
అందరికీ రూ.15వేలు ఇవ్వాలి
కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు ఉంటే అందరికీ తల్లికి వందనం కింద రూ.15వేలు అందించాలి. రూ.13వేలు ఇచ్చి చేతులు దులుపుకుంటే సహించేదిలేదు. చిరుద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికులు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, ఆశ వర్కర్ల పిల్లలకు తల్లికి వందనం అందించాలి. లేకుంటే విద్యార్థి సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిరసనలకు పిలుపునిస్తాం.
– ప్రవీణ్ కుమార్, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి, తిరుపతి
ఆలయాల రక్షణకు
అలుపెరుగని పోరాటం
నేడు కలెక్టరేట్లో ‘గ్రీవెన్స్’
తిరుపతి అర్బన్ : ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా సోమవారం కలెక్టరేట్లో గ్రీవెన్స్ నిర్వహించనున్నారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్నారు. ఆదివారం ఈ మేరకు కలెక్టర్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదిక (గ్రీవెన్స్)కు అన్నిశాఖల జిల్లా అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేశించారు. అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే చిన్న చిన్న సమస్యలను మండల, డివిజన్ స్థాయిలోనే పరిష్కరించాలని సూచించారు.
శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వరాలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. వరుస సెలవులు, ఆదివారం కావడంతో రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సుమారు 28 వేల మంది భక్తులు ముక్కంటీశుని దర్శించుకుని ఉంటారని ఆలయాధికారులు అంచనా వేశారు. రూ.500 అంతరాలయ దర్శనం టికెట్లు 703, రూ.200 ప్రత్యేక దర్శనం టికెట్లు 3,180, రూ.50 శీఘ్రదర్శనం టికెట్లు 5,008 విక్రయించినట్టు పేర్కొన్నారు. రూ.500, రూ.750, రూ.1,500, రూ.2,500, రూ.5వేలు టికెట్లు కొని 5,701 మంది భక్తులు రాహు–కేతు పూజలను చేయించుకున్నట్టు వెల్లడించారు. ఐదు రకాల ప్రసాదాలు కలిపి 24,230 అమ్ముడైనట్లు అధికారులు తెలిపారు.
– 8లో
– 8లో
న్యూస్రీల్
జిల్లా వ్యాప్తంగా
వేలాది మందికి శఠగోపం
తల్లికి వందనం.. 45శాతం మందికి ఎగనామం
కఠిన నిబంధనలతో అనర్హులుగా
ప్రకటించిన ప్రభుత్వం
లబోదిబోమంటూ సచివాలయాలకు బాధితుల పరుగులు
జాబితాలో పేర్లు లేక తల్లడిల్లుతున్న ఒకటి, ఇంటర్ ఫస్టియర్ పిల్లలు.. తల్లులు
అర్హులందరికీ లబ్ధి చేకూర్చకుంటే పోరాటం తప్పదంటున్న విద్యార్థి సంఘాలు
300 యూనిట్ల విద్యుత్ బిల్లు ఉందంటూ అనర్హత వేటు
పాఠశాలలకు సక్రమంగా రావడం లేదని, డ్రాప్ అవుట్స్ పేరుతో అనర్హులు
పొలం ఎంత ఉందనే విషయం చూడకుండా.. పొలం ఉంటే చాలు కట్
కాంట్రాక్ట్,ఔట్సోర్సింగ్ ఉద్యోగులుగా ఉంటే అనర్హులే
ఇంటర్ కాకుండా పాలిటెక్నిక్, ఐటీఐ కోర్సులలో చేరినవారికి మొండి చెయ్యి
విద్యార్థి తల్లి ఇంటి పేరు మారినా, చిన్నపాటి తప్పులు ఉన్నా కట్
తల్లి మరణించిన విద్యార్థులు సచివాలయంలో కలవాలని మెలిక
ఒకటి, ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు తర్వాత వేస్తామంటూ దాటవేత
మూడు, నాలుగు చక్రాల వాహనాలు ఉన్నా అనర్హత వేటు
పట్టణాలలో వెయ్యి చ.అడుగుల స్థలం ఉన్నా, సొంత ఇల్లు ఉన్నా కట్
3 ఎకరాల పొలం ఉన్నా అనర్హులే
ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన వారికి తల్లికి వందనం కట్

ముక్కంటీశుని ఆలయం కిటకిట

ముక్కంటీశుని ఆలయం కిటకిట

ముక్కంటీశుని ఆలయం కిటకిట

ముక్కంటీశుని ఆలయం కిటకిట

ముక్కంటీశుని ఆలయం కిటకిట

ముక్కంటీశుని ఆలయం కిటకిట

ముక్కంటీశుని ఆలయం కిటకిట

ముక్కంటీశుని ఆలయం కిటకిట

ముక్కంటీశుని ఆలయం కిటకిట