
చాయ్ పే చర్చ
తిరుపతి గాంధీరోడ్డు: తిరుపతిలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ మంగళవారం ఉదయం చాయ్ పే చర్చ కార్యక్రమం ఉదయం 7.30 గంటలకు బాబు జగ్జీవన్ రావు పార్క్ వద్ద నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కార్యకర్తలు, ప్రజలతో మమేకమై సలహాలు, సూచనలు చేశారు. అనంతరం ఉదయం 9 గంటలకు శంకరంబాడికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం లీలామహల్ కూడలి నుంచి శోభాయాత్రగా కచ్ఛపి ఆడిటోరియానికి చేరుకున్నారు. అనంతరం కార్యకర్తలతో సమావేశమయ్యారు. తరువాత సాయత్రం 5 గంటలకు మీడియాతో చిట్చాట్ నిర్వహించారు. అనంతరం చాంబర్ ఆఫ్ కామర్స్ నాయకులతో సమావేశమయ్యారు.