మురిపించే వర్ణం.. వకుళామాత పరవశం!
తిరుపతి జిల్లాలో గత రెండు రోజుల నుంచి వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండ మండిపోతోంది. ఆ తర్వాత ఆకాశం మేఘావృతమవుతోంది. మబ్బుల మాటున సూరీడి కిరణాలు విభిన్న వర్ణాలతో ఆకట్టుకుంటున్నాయి. శుక్రవారం చంద్రగిరి రూరల్ పరిధిలోని పేరూరు బండపై వెలసిన శ్రీవకులామాత ఆలయం ఎర్రటి మబ్బుల నీడలో శోభాయమానంగా వెలుగొందుతూ భక్తులను ఆకట్టుకుంది. ఈ సుందర దృశ్యాన్ని ‘సాక్షి’ క్లిక్ మనిపించింది. – సాక్షి ఫొటోగ్రాఫర్, తిరుపతి


