
పూర్తి దేశీయ పరిజ్ఞానంతో తయారుచేసిన వెమ్ టెక్నాలజీ సంస్థ
యుద్ధ విమానంలోని ప్రధాన భాగం తయారీ
రేపు హెచ్ఏఎల్కు అప్పగింత
శంషాబాద్: భారతదేశం అభివృద్ధి చేసిన తేజస్ యుద్ధ విమానంలో ప్రధాన భాగాన్ని (సెంట్రల్ ఫ్యూస్లేజ్) పూర్తి దేశీయ పరిజ్ఞానంతో వెమ్ టెక్నాలజీ సంస్థ తయారు చేసింది. దీనికి ‘మార్క్1ఏ’గా నామకరణం చేసింది. రక్షణ రంగంలోని వివిధ పరికరాల తయారీలో పేరుగాంచిన ఈ సంస్థ హిందుస్తాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ (హెచ్ఏఎల్)తో తొలుత అభివృద్ధి భాగస్వామిగా సెంట్రల్ ఫ్యూస్లేజ్ (సీఎఫ్)ను తయారుచేసి సక్సెస్ కావడంతో ఉత్పత్తి భాగస్వామిగా మారింది. 3 నెలల్లో తొలి సీఎఫ్ విజయవంతంగా పూర్తి చేసి హెచ్ఏఎల్కు అందించేందుకు సిద్ధమైంది. యుద్ధవిమానంలోని సీఎఫ్ను తయారుచేసిన దేశీయ మొదటి ప్రైవేటు సంస్థగా ఇది నిలిచింది.
ఏమిటి సీఎఫ్?
డెల్టావింగ్ కలిగి ఒకే ఇంజిన్తో పనిచేసే తేజస్ మల్టిరోల్ లైట్ కాంబాట్ యుద్ధవిమానాన్ని హెచ్ఏఎల్ రూపొందించిన సంగతి తెలిసిందే. విమానంలో ఫ్రంట్ ఫ్యూస్లేజ్ అంటే పైలట్ కూర్చునే భాగం, రియర్ ఫ్యూస్లేజ్ అంటే విమానంలోని వెనుక భాగం, కింద ఉండే ల్యాండింగ్ విభాగాలను అనుసంధానించుకునే ప్రధాన భాగాన్నే (విమానం మధ్యలో ఉండే) సెంట్రల్ ఫ్యూస్లేజ్ అంటారు. ఇది మానవ శరీరంలోని మధ్యభాగంలాంటిదన్నమాట. మిగతా అన్ని భాగాలను దీనితో అనుసంధానిస్తారు. ఇందులోనే ప్రధానమైన ఇంజిన్ కూడా ఉంటుంది.
ఏమిటి సీఎఫ్?
డెల్టావింగ్ కలిగి ఒకే ఇంజిన్తో పనిచేసే తేజస్ మల్టిరోల్ లైట్ కాంబాట్ యుద్ధవిమానాన్ని హెచ్ఏఎల్ రూపొందించిన సంగతి తెలిసిందే. విమానంలో ఫ్రంట్ ఫ్యూస్లేజ్ అంటే పైలట్ కూర్చునే భాగం, రియర్ ఫ్యూస్లేజ్ అంటే విమానంలోని వెనుక భాగం, కింద ఉండే ల్యాండింగ్ విభాగాలను అనుసంధానించుకునే ప్రధాన భాగాన్నే (విమానం మధ్యలో ఉండే) సెంట్రల్ ఫ్యూస్లేజ్ అంటారు. ఇది మానవ శరీరంలోని మధ్యభాగంలాంటిదన్నమాట. మిగతా అన్ని భాగాలను దీనితో అనుసంధానిస్తారు. ఇందులోనే ప్రధానమైన ఇంజిన్ కూడా ఉంటుంది.
నెలకు ఒకటి తయారీ
హెచ్ఏఎల్ పర్యవేక్షణలో శిక్షణ పొందిన బృందంతో 3 నెలల్లో తొలి సీఎఫ్ తయారు చేశాం. వివిధ దశల్లో హెచ్ఏఎల్ క్లియరెన్స్తో దీనిని పూర్తి చేశాం. ఇకపై నెలకొకటి చొప్పున అందజేసేందుకు సిద్ధంగా ఉన్నాం. హెచ్ఏఎల్ పర్యవేక్షణతో వారి క్లియరెన్స్తో వీటి తయారీ జరుగుతుంది. ప్రస్తుతం 20 సీఎఫ్ల తయారీకి హెచ్ఏఎల్ అనుమతినిచ్చింది. – సీహెచ్వీ రామారావు, జీఎం, వెమ్ టెక్నాలజీ
హైదరాబాద్లో...
హైదరాబాద్లోని వెమ్ టెక్నాలజీ సంస్థ రూపొందించిన ఈ సీఎఫ్ తయారీలో 25 మంది ఇంజనీర్లు, 35 మంది టెక్నీషియన్ల బృందం పాల్గొంది. దీనికోసం మొత్తం 1,595 కాంపోనెంట్స్ వాడారు. వివిధ భాగాలను అనుసంధానించేందుకు సంస్థలో జిగ్ (పరికరాలను బిగించే ప్రాంతం) ఏర్పాటు చేసుకున్నారు.
ప్రస్తుతం సంస్థలో రెండు జిగ్లున్నాయి. వెమ్ టెక్నాలజీ సంస్థ తన తొలి సీఎఫ్ మార్క్1ఏ ను శుక్రవారం హెచ్ఏఎల్కు అప్పగించనుంది. ఈ కార్యక్రమానికి కేంద్ర రక్షణ శాఖ కార్యదర్శి సంజీవ్కుమార్, హెచ్ఏఎల్ సీఎండీ డాక్టర్ డీకే సునీల్, హెచ్ఏఎల్ డైరెక్టర్ కె.రవి హాజరు కానున్నారు.