సాక్షి,హైదరాబాద్: కేంద్ర మంత్రి బండి సంజయ్ తల్లి శకుంతలకు గుండెపోటు వచ్చింది. అప్రమత్తమైన కుటుంబసభ్యులు అత్యవసర చికిత్స నిమిత్తం కరీంనగర్ నుంచి హైదరాబాద్ గచ్చిబౌలిలోని మెడికవర్ ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం హార్ట్ స్టెంట్ వేసి చికిత్స అందిస్తున్నారు. బండి సంజయ్ స్వయంగా ఆసుపత్రికి చేరుకుని తల్లి ఆరోగ్య పరిస్థితిని వైద్యుల్ని అడిగి తెలుసుకున్నారు.


