ప్రజా రవాణాతోనే సురక్షిత ప్రయాణం

TSRTC MD Sajjanar New Year Celebrations At Mahatma Gandhi Bus Station - Sakshi

ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ 

అఫ్జల్‌గంజ్‌/సాక్షి, హైదరాబాద్‌: సురక్షితమైన ప్రయాణానికి ప్రయాణికులు ప్రజా రవాణా వ్యవస్థను ఆదరించాలని టీఎస్‌ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ పేర్కొన్నారు. శనివారం మహాత్మాగాంధీ బస్‌ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన నూతన సంవత్సర వేడుకల్లో ప్రయాణికులతో కలిసి కేక్‌ కట్‌ చేశారు.

వృద్ధులు, చిన్న పిల్లల తల్లిదండ్రుల సౌకర్యార్థం సీబీఎస్‌ నుంచి ఎంజీబీఎస్‌లోని ప్లాట్‌ఫాంల వరకు ప్రయాణికులను చేరవేసేందుకు వీలుగా నూతన బగ్గి వాహన సేవల్ని ప్రారంభించారు. త్వరలోనే అన్ని ప్రధాన బస్‌స్టేషన్లలో వీటిని అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ఖైరతాబాద్‌లోని ట్రాన్స్‌పోర్టు భవన్‌ ఉన్న తన కార్యాలయంలో కేక్‌ కట్‌ చేశారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top