రేవంత్‌ ఇంటికి తెలంగాణ డీజీపీ.. భద్రత పెంపు | Telangana DGP Anjani Kumar Meets TPCC Revanth Reddy - Sakshi
Sakshi News home page

రేవంత్‌ ఇంటికి తెలంగాణ డీజీపీ.. భద్రత పెంపు

Dec 3 2023 12:37 PM | Updated on Dec 3 2023 1:11 PM

TS DGP Anjanni Kumar Meets TPCC Revanth Reddy - Sakshi

సాక్షి,హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్‌ పార్టీ విజయం దిశగా దూసుకెళ్తోంది. మెజార్టీ మ్యాజిక్‌ ఫిగర్‌ దాటడంతో కాంగ్రెస్‌ గెలుపు ఖాయంగా కనిపిస్తోంది. మరోవైపు.. కాంగ్రెస్‌ విజయంతో హస్తం పార్టీ శ్రేణులు వేడుక సంబురాలు చేసుకుంటున్నాయి. 

ఇదిలా ఉండగా.. టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ ఇంటికి డీజీపీ అంజనీకుమార్‌ వెళ్లారు. రేవంత్‌ను డీజీపీ మర్యాదపూర్వకంగా కలిశారు. రేవంత్‌ను కలిసిన వారిలో రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌, సంజయ్‌ కుమార్‌ జైన్‌ ఉన్నారు. కాంగ్రెస్‌ విజయం నేపథ్యంలో ఆయనను అభినందించినట్టు తెలుస్తోంది. ఇక, రేవంత్‌ రెడ్డికి భద్రతను కూడా పెంచారు. మరోవైపు.. కౌంటింగ్‌ నేపథ్యంలో కాంగ్రెస్‌ కార్యకర్తలు భారీ సంఖ్యలో రేవంత్‌ ఇంటికి చేరుకున్నారు. సంబురాలు చేసుకుంటున్నారు. 

అంతకుముందు రేవంత్‌ రెడ్డి ట్వీట్‌ ఇది..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement